భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 204 కేజీల భారీ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాచలంలోని సీఆర్పీఎఫ్ క్యాంప్ సమీపంలో ఎస్ఐ మహేశ్ పెట్రోలింగ్ చేస్తుండగా ఓ కారులో పెద్ద మెుత్తంలో గంజాయి పట్టుబడినట్లు సీఐ వినోద్రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భద్రాచలం మీదుగా గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా భద్రాచలంలో పట్టుకున్నట్లు సీఐ వెల్లడించారు. గంజాయి రవాణా చేస్తున్న మహబూబాబాద్కు చెందిన ఓ యువకుడ్ని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.30 లక్షల అరవై వేలు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : ఆ విషయంలో సీఎంను ప్రశ్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి