ETV Bharat / state

ఉట్నూర్​లో రోడ్డెక్కిన ప్రజా రవాణా

author img

By

Published : May 19, 2020, 3:52 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు... రాష్ట్ర సర్కారు ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్​ జిల్లా ఉట్నూర్​ డిపో నుంచి ఉదయం 6 గంటకే వివిధ రూట్లకు బస్సులు బయల్దేరాయి. ​

adilabad district latest news
adilabad district latest news

ఆదిలాబాద్​ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉట్నూర్​ డిపోలో 32 బస్సులు ఉండగా ఈరోజు 22 బస్సులు ఉదయం 6 గంటలకే వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. కానీ బస్సు సీట్లపై ఎలాంటి గుర్తులు పెట్టలేదు.

అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్​ అందజేశారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు.

ఆదిలాబాద్​ జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఉట్నూర్​ డిపోలో 32 బస్సులు ఉండగా ఈరోజు 22 బస్సులు ఉదయం 6 గంటలకే వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్​డౌన్​ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. కానీ బస్సు సీట్లపై ఎలాంటి గుర్తులు పెట్టలేదు.

అలాగే ప్రయాణికులు చేతులను శుభ్రం చేసుకునేందుకు కండక్టర్లు శానిటైజర్​ అందజేశారు. మాస్కులు ధరించని వారిని బస్సులోకి అనుమతించడంలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.