ఆదిలాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజన గురుకులాల విద్యార్థులు వీరు. మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ పాఠాలు వినేందుకు ఇలా అవస్థలు పడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు సిగ్నళ్లు అందకపోవడంతో చెట్లు ఎక్కి సిగ్నళ్లను అందుకుని, పాఠాలు వినే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆదివారం ఈ ఫొటోను ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: ఖాజిపల్లి అర్బన్ ఫారెస్ట్ను దత్తత తీసుకున్న ప్రభాస్