ETV Bharat / state

కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

author img

By

Published : Sep 20, 2020, 4:59 AM IST

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కడంబా అడవుల్లో తూటాలు పేలాయి. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తృటిలో తప్పించుకున్నాడు. పోలీసులు కడంబా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. వ్యూహాన్ని చాకచక్యంగా అమలు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో... శనివారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. రెండు రోజుల కిందట ఆసిఫాబాద్‌ పట్టణం సమీపంలోని చీలేటిగూడకు... మంచిర్యాల, కుముంరంభీం జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ వచ్చిన సమాచారంతో... పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో మావోయిస్టులకు చెందిన నాలుగు సంచులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక దళాలతో జల్లెడ..

అనంతరం మహారాష్ట్ర వైపు వెళ్లే కాగజ్‌నగర్, పెంచికల్‌ పేట్‌, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతాలను, రహదారులను 8 ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లోని... కొండ వద్ద రాత్రి 10 గంటల సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. భాస్కర్‌ సహా మరో మావోయిస్టు తప్పించుకున్నారు.

భీకర కాల్పులు..

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి సమీపంలో కొండపై భాస్కర్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... 400 మందితో చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎదురుకాల్పులు భీకరంగా కొనసాగినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం జోగాపూర్‌ అటవీ ప్రాంతంలో 2010లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య పరస్పరం కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌, జర్నలిస్టు హేమంత్‌చంద్రపాండే చనిపోయారు.

తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే పునరావృతం కావటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు డీజీపీ మహేందర్‌రెడ్డి... 5 రోజులపాటు జిల్లాలో మకాం వేసి...మావోయిస్టుల కదలికలపై పోలీసులకు దిశానిర్దేశం చేసిన కొద్ది రోజులకే... ఎన్‌కౌంటర్‌ జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదీ చూడండి: సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ

కడంబా అడవుల్లో ఎన్​కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై గట్టి నిఘా పెట్టిన పోలీసులు.. వ్యూహాన్ని చాకచక్యంగా అమలు చేశారు. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లో... శనివారం రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. రెండు రోజుల కిందట ఆసిఫాబాద్‌ పట్టణం సమీపంలోని చీలేటిగూడకు... మంచిర్యాల, కుముంరంభీం జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ వచ్చిన సమాచారంతో... పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో మావోయిస్టులకు చెందిన నాలుగు సంచులు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

ప్రత్యేక దళాలతో జల్లెడ..

అనంతరం మహారాష్ట్ర వైపు వెళ్లే కాగజ్‌నగర్, పెంచికల్‌ పేట్‌, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతాలను, రహదారులను 8 ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో కాగజ్‌నగర్‌ మండలం కడంబా అడవుల్లోని... కొండ వద్ద రాత్రి 10 గంటల సమయంలో పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. భాస్కర్‌ సహా మరో మావోయిస్టు తప్పించుకున్నారు.

భీకర కాల్పులు..

ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతానికి సమీపంలో కొండపై భాస్కర్‌ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... 400 మందితో చుట్టుముట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎదురుకాల్పులు భీకరంగా కొనసాగినట్లు తెలిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం జోగాపూర్‌ అటవీ ప్రాంతంలో 2010లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య పరస్పరం కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌, జర్నలిస్టు హేమంత్‌చంద్రపాండే చనిపోయారు.

తాజాగా ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే పునరావృతం కావటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి తోడు డీజీపీ మహేందర్‌రెడ్డి... 5 రోజులపాటు జిల్లాలో మకాం వేసి...మావోయిస్టుల కదలికలపై పోలీసులకు దిశానిర్దేశం చేసిన కొద్ది రోజులకే... ఎన్‌కౌంటర్‌ జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇదీ చూడండి: సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.