ఆదిలాబాద్లో న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కరోనా వ్యాధి నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి మొదలైన ఈ ర్యాలీని జిల్లా న్యాయమూర్తి ప్రియదర్శిని ప్రారంభించారు.
డైట్ ఛాత్రోపాధ్యాయులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ... అవగాహన కల్పించారు. సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు ఉద్యోగులతో కలిసి న్యాయమూర్తి ర్యాలీలో పాల్గొన్నారు.