ETV Bharat / state

MLA Rathod Bapurao Car Accident : బోథ్‌ ఎమ్మెల్యేకు తప్పిన పెనుప్రమాదం

MLA Rathod Bapurao Car Accident at Nirmal : ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ ఎమ్మెల్యే రాఠోడ్‌ బాపురావుకు పెనుప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నిర్మల్‌ బైపాస్‌ సమీపంలో ఆవును ఢీకొట్టింది. ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా.. ఎమ్మెల్యే చేతికి తీవ్ర గాయమైంది.

author img

By

Published : Jun 24, 2023, 5:13 PM IST

Updated : Jun 24, 2023, 7:35 PM IST

MLA Rathod Bapurao Car Accident
MLA Rathod Bapurao Car Accident

MLA Rathod Bapurao Car Accident News : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆయన వాహనం.. నెరడిగొండ మండలం కొరిటికల్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఎదురుగా పశువు రావడంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ఘటనలో ఎమ్మెల్యే చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బోథ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఎమ్మెల్యే ఆదిలాబాద్‌లోని తన స్వగృహానికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. అందరి ఆశీస్సుల వల్ల ప్రాణాలతో బయటపడ్డానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ నెల 22న తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ వెళ్లాను. ఈరోజు తిరిగి వస్తుండగా.. అనుకోకుండా రోడ్డుప్రమాదం జరిగింది. దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల ఎలాంటి అపాయం జరగలేదు. నన్ను పరామర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇది దేవుడు నాకు ఇచ్చిన రెండో జన్మగా భావిస్తా. - రాఠోడ్‌ బాపూరావు, బోథ్‌ ఎమ్మెల్యే

ఉదయం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ కారు సైతం ప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పీఠానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోహిత్‌ రెడ్డి కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

అతి వేగానికి ముగ్గురు యువకులు బలి..: ఇదిలా ఉండగా.. ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బొలెరో వాహనం అదుపు తప్పి లారీని ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ఘటనా స్థలిలో ఒకరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మృతులు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో గొర్రెలు తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు.

నాగర్‌ కర్నూల్ జిల్లాకు చెందిన రవి, వనపర్తి జిల్లాకు చెందిన అశోక్, శంకర్‌లు.. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో బొలెరో వాహనంలో గొర్రెలు తీసుకుని శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై తిరిగి వస్తుండగా.. షాద్‌నగర్‌ శివారులోని సోలీపూర్‌ సమీపంలో గల వై-జంక్షన్‌ వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న వీరి వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో డివైడర్‌పైకి ఎక్కిన బొలెరో రోడ్డుకు మరోవైపు దూసుకెళ్లింది. ఇదే సమయంలో జడ్చర్ల వైపు నుంచి హైదరాబాద్‌కు వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

ఇవీ చూడండి..

Road accident in Shadnagar Today : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Mother and Daughter Suicide : 'ఆట ఆరంభం.. నిన్ను సంతోషపెట్టే పని మాత్రమే చేయి'.. అని ​రాసి తల్లీకుమార్తె ఆత్మహత్య

MLA Rathod Bapurao Car Accident News : ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే రాఠోడ్ బాపూరావుకు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఆయన వాహనం.. నెరడిగొండ మండలం కొరిటికల్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ఎదురుగా పశువు రావడంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ఘటనలో ఎమ్మెల్యే చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆయనను బోథ్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఎమ్మెల్యే ఆదిలాబాద్‌లోని తన స్వగృహానికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలిసిన బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. అందరి ఆశీస్సుల వల్ల ప్రాణాలతో బయటపడ్డానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ నెల 22న తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ వెళ్లాను. ఈరోజు తిరిగి వస్తుండగా.. అనుకోకుండా రోడ్డుప్రమాదం జరిగింది. దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల ఎలాంటి అపాయం జరగలేదు. నన్ను పరామర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఇది దేవుడు నాకు ఇచ్చిన రెండో జన్మగా భావిస్తా. - రాఠోడ్‌ బాపూరావు, బోథ్‌ ఎమ్మెల్యే

ఉదయం ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ కారు సైతం ప్రమాదానికి గురైంది. కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి పీఠానికి వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి రోహిత్‌ రెడ్డి కారు చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే కారులో లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

అతి వేగానికి ముగ్గురు యువకులు బలి..: ఇదిలా ఉండగా.. ఈ ఉదయం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ శివారులో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. బొలెరో వాహనం అదుపు తప్పి లారీని ఢీకొనటంతో ప్రమాదం చోటుచేసుకోగా.. ఘటనా స్థలిలో ఒకరు, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు. మృతులు నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో గొర్రెలు తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు.

నాగర్‌ కర్నూల్ జిల్లాకు చెందిన రవి, వనపర్తి జిల్లాకు చెందిన అశోక్, శంకర్‌లు.. బక్రీద్‌ పండుగ నేపథ్యంలో బొలెరో వాహనంలో గొర్రెలు తీసుకుని శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లారు. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై తిరిగి వస్తుండగా.. షాద్‌నగర్‌ శివారులోని సోలీపూర్‌ సమీపంలో గల వై-జంక్షన్‌ వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న వీరి వాహనం అదుపుతప్పింది. ఈ క్రమంలో డివైడర్‌పైకి ఎక్కిన బొలెరో రోడ్డుకు మరోవైపు దూసుకెళ్లింది. ఇదే సమయంలో జడ్చర్ల వైపు నుంచి హైదరాబాద్‌కు వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

ఇవీ చూడండి..

Road accident in Shadnagar Today : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Mother and Daughter Suicide : 'ఆట ఆరంభం.. నిన్ను సంతోషపెట్టే పని మాత్రమే చేయి'.. అని ​రాసి తల్లీకుమార్తె ఆత్మహత్య

Last Updated : Jun 24, 2023, 7:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.