ఆదిలాబాద్లో కరోనా వ్యాధి కట్టడిలో భాగంగా అధికార యంత్రాంగం ఆంక్షలను కఠినతరం చేసింది. 19 వార్డులను కంటైన్మెంట్ ప్రాంతంగా గుర్తించిన పోలీసుశాఖ.. తాజాగా వీటిని ఏడుజోన్లుగా విభజించింది. కాలనీల మధ్య కూడా రాకపోకల వెసులుబాటును కట్టడి చేసింది. అత్యవసర సేవలకు వెళ్లేవారిని మినహాయిస్తే.. అనవసరంగా బయట తిరిగే వారి వాహనాలను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ మరింత ముమ్మరం చేశారు.
రైతులు పాస్ పుస్తకాలతో బయటకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర సేవల పేరుతో చాలా మంది బయటకు రావడం సమంజసం కాదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ప్రజలంతా ఎన్టీఆర్ చౌక్ నుంచే రాకపోకలు సాగించారు. ఇప్పుడు తాజాగా ప్రకటించిన ఏడు జోన్లకు అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలకు అనుగుణంగా ఆరు మార్గాలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ పరిధిలో 19 కంటైన్మెంట్ ప్రాంతాలు