ETV Bharat / state

'మహిళ ప్రసవం.. ఆసుపత్రిగా మారిన ఆర్టీసీ బస్సు'

author img

By

Published : Jun 27, 2022, 10:28 AM IST

Woman delivery in RTC bus: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది. ఆమెతో పాటు ప్రయాణించే బంధువులు, తోటి ప్రయాణికులు సపర్యలు చేయడంతో పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది.

Woman delivery in RTC bus
Woman delivery in RTC bus

Woman delivery in RTC bus : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలూకా సింగరివాడకి చెందిన గర్భిణి మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్‌ మండలం మనకాపూర్‌ వద్దకు రాగానే పురిటినొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.

ఆర్టీసీ బస్సులోనే ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108కు ఫోన్‌ చేసినా సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్‌.. బస్సును నేరుగా గుడిహత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించారు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు సంతోషించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్‌, డీఎం విజయ్‌ ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవితకాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్‌ పాస్‌ అందిస్తామని అధికారులు తెలిపారు. తల్లీబిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన బస్సు డ్రైవర్‌ ఎం. అంజన్న, కండక్టర్‌ సీహెచ్‌ గబ్బర్‌సింగ్‌ను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, సీఎండీ సజ్జనార్‌ అభినందించారు.

Woman delivery in RTC bus : పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలూకా సింగరివాడకి చెందిన గర్భిణి మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్‌ మండలం మనకాపూర్‌ వద్దకు రాగానే పురిటినొప్పులు రావడంతో విషయం తెలిసి డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.

ఆర్టీసీ బస్సులోనే ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108కు ఫోన్‌ చేసినా సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్‌.. బస్సును నేరుగా గుడిహత్నూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించారు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు ప్రయాణికులు సంతోషించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్‌, డీఎం విజయ్‌ ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవితకాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్‌ పాస్‌ అందిస్తామని అధికారులు తెలిపారు. తల్లీబిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన బస్సు డ్రైవర్‌ ఎం. అంజన్న, కండక్టర్‌ సీహెచ్‌ గబ్బర్‌సింగ్‌ను ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, సీఎండీ సజ్జనార్‌ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.