ETV Bharat / sports

'పతకం గెలవకపోయినా.. ఆ 20 మందికి భారీ నజరానా'

author img

By

Published : Aug 11, 2021, 7:16 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో కొద్ది తేడాలో పతకం కోల్పోయిన 20 మంది భారత అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ప్రముఖ ఫార్మా సంస్థ ముందుకొచ్చింది. వారికి తలో రూ. 11 లక్షల చొప్పున ప్రైజ్​మనీ ప్రకటించింది.

Mankind Pharma to give Rs 11 lakh each to 20 players
పతకం తేకున్నా.. ఆ 20 మందికి భారీ నజరానా, మ్యాన్​కైండ్​ ఫార్మా

ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్​కైండ్​ ఫార్మా.. ఉదారతను చాటుకుంది. టోక్యో ఒలింపిక్స్​లో త్రుటిలో పతకాలు కోల్పోయిన 20 మంది భారత క్రీడాకారులను సన్మానించనుంది. వారి అంకిత భావం, కఠోర శ్రమకు గౌరవం ఇస్తూ.. మరింత ప్రోత్సాహం అందించే విధంగా ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది.

అథ్లెట్లు ఎదుర్కొనే, ఎదుర్కొంటున్న కష్టాలను తమ కంపెనీ అర్థం చేసుకుందని, వారిలో మరింత స్ఫూర్తి నింపేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాన్​కైండ్​ ఫార్మా ఓ ప్రకటనలో తెలిపింది.

భారత మహిళల హాకీ జట్టులోని మొత్తం 16 మందికి.. రూ. 11 లక్షల చొప్పున అందించనుంది. ఇంకా.. బాక్సర్​ సతీశ్​ కుమార్​, రెజ్లర్​ దీపక్​ పునియా, షూటర్​ సౌరభ్​ చౌదరీ, గోల్ఫర్​ అదితి అశోక్​కూ.. ఈ నగదు బహుమానం అందనుంది.

Mankind Pharma
మహిళల హాకీ జట్టు
Mankind Pharma
రెజ్లర్​ దీపక్​ పునియా

ఇదీ చూడండి: రెజ్లింగ్​ కాంస్య పతక పోరులో దీపక్​ పునియా ఓటమి

''దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటేనే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని రావాలి. ప్రతి క్రీడలోనూ విజయమే ప్రామాణికం కాదు.''

- రాజీవ్​ జునేజా, మ్యాన్​కైండ్​ ఫార్మా వైస్​ ఛైర్మన్​, ఎండీ

వీరందరికీ కొద్దిలో పతకం చేజారినా.. ప్రతి ఒక్కరి మనసులు గెలిచారని కొనియాడారు రాజీవ్​.

టోక్యో ఒలింపిక్స్​లో భారత మహిళల హాకీ జట్టు.. గ్రేట్​ బ్రిటన్​తో కాంస్య పతక పోరులో పోరాడి ఓడింది. బాక్సర్​ సతీశ్​ కుమార్​ క్వార్టర్​ ఫైనల్లో, షూటర్​ సౌరభ్​ ఫైనల్లో ఓడి పతకానికి కొద్ది దూరంలో నిలిచారు. గోల్ఫర్​ అదితి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసినా.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

Mankind Pharma
గోల్ఫర్​ అదితి అశోక్​
Mankind Pharma
బాక్సర్​ సతీశ్​ కుమార్​
Mankind Pharma
షూటర్​ సౌరభ్​ చౌదరీ

ఇవీ చూడండి: 13 కుట్లు పడినా.. పోరాడి ఓడిన బాక్సర్​ సతీశ్​ కుమార్​

అదితి అద్భుత ప్రదర్శన.. కానీ!

ప్రముఖ ఫార్మా సంస్థ మ్యాన్​కైండ్​ ఫార్మా.. ఉదారతను చాటుకుంది. టోక్యో ఒలింపిక్స్​లో త్రుటిలో పతకాలు కోల్పోయిన 20 మంది భారత క్రీడాకారులను సన్మానించనుంది. వారి అంకిత భావం, కఠోర శ్రమకు గౌరవం ఇస్తూ.. మరింత ప్రోత్సాహం అందించే విధంగా ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున నజరానా ఇవ్వనుంది.

అథ్లెట్లు ఎదుర్కొనే, ఎదుర్కొంటున్న కష్టాలను తమ కంపెనీ అర్థం చేసుకుందని, వారిలో మరింత స్ఫూర్తి నింపేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మ్యాన్​కైండ్​ ఫార్మా ఓ ప్రకటనలో తెలిపింది.

భారత మహిళల హాకీ జట్టులోని మొత్తం 16 మందికి.. రూ. 11 లక్షల చొప్పున అందించనుంది. ఇంకా.. బాక్సర్​ సతీశ్​ కుమార్​, రెజ్లర్​ దీపక్​ పునియా, షూటర్​ సౌరభ్​ చౌదరీ, గోల్ఫర్​ అదితి అశోక్​కూ.. ఈ నగదు బహుమానం అందనుంది.

Mankind Pharma
మహిళల హాకీ జట్టు
Mankind Pharma
రెజ్లర్​ దీపక్​ పునియా

ఇదీ చూడండి: రెజ్లింగ్​ కాంస్య పతక పోరులో దీపక్​ పునియా ఓటమి

''దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటేనే ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని రావాలి. ప్రతి క్రీడలోనూ విజయమే ప్రామాణికం కాదు.''

- రాజీవ్​ జునేజా, మ్యాన్​కైండ్​ ఫార్మా వైస్​ ఛైర్మన్​, ఎండీ

వీరందరికీ కొద్దిలో పతకం చేజారినా.. ప్రతి ఒక్కరి మనసులు గెలిచారని కొనియాడారు రాజీవ్​.

టోక్యో ఒలింపిక్స్​లో భారత మహిళల హాకీ జట్టు.. గ్రేట్​ బ్రిటన్​తో కాంస్య పతక పోరులో పోరాడి ఓడింది. బాక్సర్​ సతీశ్​ కుమార్​ క్వార్టర్​ ఫైనల్లో, షూటర్​ సౌరభ్​ ఫైనల్లో ఓడి పతకానికి కొద్ది దూరంలో నిలిచారు. గోల్ఫర్​ అదితి స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసినా.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

Mankind Pharma
గోల్ఫర్​ అదితి అశోక్​
Mankind Pharma
బాక్సర్​ సతీశ్​ కుమార్​
Mankind Pharma
షూటర్​ సౌరభ్​ చౌదరీ

ఇవీ చూడండి: 13 కుట్లు పడినా.. పోరాడి ఓడిన బాక్సర్​ సతీశ్​ కుమార్​

అదితి అద్భుత ప్రదర్శన.. కానీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.