ETV Bharat / sports

Olympics: రవి ఫైనల్​ పోరు.. కాంస్యం కోసం హాకీ జట్టు

author img

By

Published : Aug 4, 2021, 10:58 PM IST

పసిడి గెలుస్తుందనుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఆశలకు గండి పడింది. ఇప్పడు కనీసం కాంస్యమైన దక్కించుకుంటారో లేదో చూడాలి. గురువారం బెల్జియంతో తలపడనుంది మన్​ప్రీత్​ సేన. రెజ్లింగ్​లో స్వర్ణ పోరుకు రవి దాహియా సిద్ధమయ్యాడు. మొత్తంగా భారత అథ్లెట్లు 14వ రోజు ఆడనున్న మ్యాచ్​ల షెడ్యూల్ ఇదే..

ravi dahiya, indian men's hockey team
రవి దాహియా, పురుషుల హాకీ టీమ్

టోక్యో ఒలింపిక్స్​లో 14వ రోజు భారత బృందానికి పలు ఈవెంట్లలో పతకాలు వచ్చే అవకాశం ఉంది. పురుషుల హాకీలో జర్మనీపై భారత్​ గెలిస్తే కాంస్య పతకం వస్తుంది. అలాగే రెజ్లింగ్​లో రవి దాహియా 57 కిలోల విభాగంలో ఫైనల్​ మ్యాచ్​ ఆడనున్నాడు. గురువారానికి సంబంధించి భారత అథ్లెట్ల షెడ్యూల్​ ఇదే..

గోల్ఫ్​..

  • మహిళల రెండో రౌండ్​ మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం ఉదయం 4.00 గంటలకు ప్రారంభం అవుతుంది. భారత్​ తరఫున అదితి అశోక్​ పాల్గొంటుంది.
  • మరో మహిళల రౌండ్​-2 మ్యాచ్​ ఉదయం 5.44 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో ఇండియా నుంచి దీక్షా దగర్​ పాల్గొంటుంది.

హాకీ..

  • ఇప్పటికే సెమీస్​లో బెల్జియం చేతిలో ఓడిన భారత జట్టుకు స్వర్ణంతో పాటు రజతం గెలిచే అవకాశం లేకుండా పోయింది. జర్మనీతో జరిగే ఈ మ్యాచ్​లో విజయం సాధిస్తే కనీసం కాంస్యమైన దక్కుతుంది. ఈ మ్యాచ్​ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుంది.

రెజ్లింగ్​..

  • మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్​ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్​ మ్యాచ్​ ఆడనుంది. ఈ పోటీ ఉదయం 7.37 గంటలకు ప్రారంభం అవుతుంది.
  • ఈ మ్యాచ్​లో గెలిస్తే అన్షు మాలిక్​ అదే విభాగంలో కాంస్య పతక మ్యాచ్​కు అర్హత సాధిస్తుంది. ఆ పోటీ సాయంత్రం 5.35 గంటలకు ఉంటుంది.
  • మహిళల 53 కిలోల ఫ్రీ స్టైల్​ 1/8 ఫైనల్ మ్యాచ్​లో భారత రెజ్లర్​ వినేశ్​ ఫోగట్​ పాల్గొననుంది. ఈ పోటీ ఉదయం 8.00 గంటలకు స్టార్ట్​ అవుతుంది.
  • ఈ మ్యాచ్​లో ఫోగట్​ గెలుపొందితే అదే విభాగంలో క్వార్టర్స్​కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్​ ఉదయం 8.56 గంటలకు ఉంటుంది.
  • ఒకవేళ క్వార్టర్స్​లోనూ వినేశ్ విజయం సాధిస్తే సెమీస్​కు క్వాలిఫై అవుతుంది. ఈ మ్యాచ్​ మధ్యాహ్నం 3.25 గంటలకు జరుగుతుంది.
  • 57 కిలోల పురుషుల ఫ్రీ స్టైల్​ విభాగంలో రవి దాహియా మ్యాచ్​ సాయంత్రం 4.20 గంటలకు జరుగుతుంది. ఇందులో అతడు గెలిస్తే ఈ ఒలింపిక్స్​లో భారత్​కు తొలి స్వర్ణం దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే వెండి పతకం సొంతమవుతుంది.
  • సెమీస్​లో ఓడిన రెజ్లర్​ దీపక్​ పూనియా కాంస్య పతక పోరుకు సిద్ధం కానున్నాడు. 86 కిలోల విభాగంలో పోటీ పడనున్నాడు. ఈ మ్యాచ్​ సాయంత్రం 4.40 గంటలకు ఉంటుంది.

అథ్లెటిక్స్​..

  • పురుషుల 20 కి.మీ.ల రేస్​ వాక్​ ఫైనల్​ పోటీలు మధ్యాహ్నాం 1.00 గంటలకు ప్రారంభమవుతాయి. భారత్​ నుంచి కేటీ ఇర్ఫాన్​, రాహుల్ రోహిల్లా, సందీప్​ కుమార్​ పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: Olympics Day 12: రవికుమార్​, నీరజ్​ చోప్రా​ జోరు.. లవ్లీనా రికార్డు​

టోక్యో ఒలింపిక్స్​లో 14వ రోజు భారత బృందానికి పలు ఈవెంట్లలో పతకాలు వచ్చే అవకాశం ఉంది. పురుషుల హాకీలో జర్మనీపై భారత్​ గెలిస్తే కాంస్య పతకం వస్తుంది. అలాగే రెజ్లింగ్​లో రవి దాహియా 57 కిలోల విభాగంలో ఫైనల్​ మ్యాచ్​ ఆడనున్నాడు. గురువారానికి సంబంధించి భారత అథ్లెట్ల షెడ్యూల్​ ఇదే..

గోల్ఫ్​..

  • మహిళల రెండో రౌండ్​ మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం ఉదయం 4.00 గంటలకు ప్రారంభం అవుతుంది. భారత్​ తరఫున అదితి అశోక్​ పాల్గొంటుంది.
  • మరో మహిళల రౌండ్​-2 మ్యాచ్​ ఉదయం 5.44 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇందులో ఇండియా నుంచి దీక్షా దగర్​ పాల్గొంటుంది.

హాకీ..

  • ఇప్పటికే సెమీస్​లో బెల్జియం చేతిలో ఓడిన భారత జట్టుకు స్వర్ణంతో పాటు రజతం గెలిచే అవకాశం లేకుండా పోయింది. జర్మనీతో జరిగే ఈ మ్యాచ్​లో విజయం సాధిస్తే కనీసం కాంస్యమైన దక్కుతుంది. ఈ మ్యాచ్​ ఉదయం 7.00 గంటలకు ప్రారంభం అవుతుంది.

రెజ్లింగ్​..

  • మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్​ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్​ మ్యాచ్​ ఆడనుంది. ఈ పోటీ ఉదయం 7.37 గంటలకు ప్రారంభం అవుతుంది.
  • ఈ మ్యాచ్​లో గెలిస్తే అన్షు మాలిక్​ అదే విభాగంలో కాంస్య పతక మ్యాచ్​కు అర్హత సాధిస్తుంది. ఆ పోటీ సాయంత్రం 5.35 గంటలకు ఉంటుంది.
  • మహిళల 53 కిలోల ఫ్రీ స్టైల్​ 1/8 ఫైనల్ మ్యాచ్​లో భారత రెజ్లర్​ వినేశ్​ ఫోగట్​ పాల్గొననుంది. ఈ పోటీ ఉదయం 8.00 గంటలకు స్టార్ట్​ అవుతుంది.
  • ఈ మ్యాచ్​లో ఫోగట్​ గెలుపొందితే అదే విభాగంలో క్వార్టర్స్​కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్​ ఉదయం 8.56 గంటలకు ఉంటుంది.
  • ఒకవేళ క్వార్టర్స్​లోనూ వినేశ్ విజయం సాధిస్తే సెమీస్​కు క్వాలిఫై అవుతుంది. ఈ మ్యాచ్​ మధ్యాహ్నం 3.25 గంటలకు జరుగుతుంది.
  • 57 కిలోల పురుషుల ఫ్రీ స్టైల్​ విభాగంలో రవి దాహియా మ్యాచ్​ సాయంత్రం 4.20 గంటలకు జరుగుతుంది. ఇందులో అతడు గెలిస్తే ఈ ఒలింపిక్స్​లో భారత్​కు తొలి స్వర్ణం దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే వెండి పతకం సొంతమవుతుంది.
  • సెమీస్​లో ఓడిన రెజ్లర్​ దీపక్​ పూనియా కాంస్య పతక పోరుకు సిద్ధం కానున్నాడు. 86 కిలోల విభాగంలో పోటీ పడనున్నాడు. ఈ మ్యాచ్​ సాయంత్రం 4.40 గంటలకు ఉంటుంది.

అథ్లెటిక్స్​..

  • పురుషుల 20 కి.మీ.ల రేస్​ వాక్​ ఫైనల్​ పోటీలు మధ్యాహ్నాం 1.00 గంటలకు ప్రారంభమవుతాయి. భారత్​ నుంచి కేటీ ఇర్ఫాన్​, రాహుల్ రోహిల్లా, సందీప్​ కుమార్​ పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: Olympics Day 12: రవికుమార్​, నీరజ్​ చోప్రా​ జోరు.. లవ్లీనా రికార్డు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.