ETV Bharat / sports

OLYMPICS: టోక్యో ఒలింపిక్స్​తో సానియా రికార్డు!

author img

By

Published : Jun 24, 2021, 8:09 PM IST

భారత్​ తరఫున నాలుగు సార్లు ఒలింపిక్స్​లో పాల్గొన్న తొలి మహిళా క్రీడాకారిణిగా నిలవనుంది టెన్నిస్ తార సానియా మిర్జా. ఈ నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్​ కోసం కఠోర శ్రమ చేస్తున్నట్లు తెలిపింది.

sania mirza
టోక్యో ఒలింపిక్స్

టోక్యో 2020​తో భారత్​ తరఫున నాలుగు ఒలింపిక్స్​లలో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్​గా నిలవనుంది సానియా మిర్జా. ఒలింపిక్స్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించడాన్ని అథ్లెట్లందరూ గౌరవంగా భావిస్తారని తెలిపింది.

"మన సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం అన్నింటికన్నా ముఖ్యం. నేను 30ల్లో.. ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. ఇక, భారత్​కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఒలింపిక్స్​ లాంటి వేదికల్లో అది గౌరవంగా భావిస్తా."

- సానియా మిర్జా, భారత టెన్నిస్ క్రీడాకారిణి

2018లో ఇజాన్​కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్​ గెలిచి సెకండ్​ ఇన్నింగ్స్​ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్​బోర్న్​ ఇంటర్నేషనల్​ ఈవెంట్​లో తొలి రౌండ్​లోనే సానియా జోడీ నిష్క్రమించింది. ప్రస్తుతం నెల వ్యవధిలో జరగనున్న వింబుల్డన్, ఒలింపిక్స్​లపై దృష్టి సారించింది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పింది.

'కోర్టు లోపల, బయట కఠోర సాధన చేస్తున్నా. చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి శ్రమిస్తున్నా. డబుల్స్​లో అంకితా రైనాతో జతకట్టడం సంతోషంగా ఉంది. టాప్​ 100లో ఉన్న భారత క్రీడాకారిణితో ఒలింపిక్స్​కు వెళ్లడం ఇదే తొలిసారి' అని సానియా తెలిపింది.

ఇదీ చూడండి: 'ఆ సమయంలో కారణం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి'

టోక్యో 2020​తో భారత్​ తరఫున నాలుగు ఒలింపిక్స్​లలో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్​గా నిలవనుంది సానియా మిర్జా. ఒలింపిక్స్​లో భారత్​కు ప్రాతినిధ్యం వహించడాన్ని అథ్లెట్లందరూ గౌరవంగా భావిస్తారని తెలిపింది.

"మన సామర్థ్యాలపై నమ్మకం ఉంచడం అన్నింటికన్నా ముఖ్యం. నేను 30ల్లో.. ఈ స్థాయిలో ఉన్నా. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించను. ఇక, భారత్​కు ప్రాతినిధ్యం వహించడం నాకెంతో ఇష్టం. ముఖ్యంగా ఒలింపిక్స్​ లాంటి వేదికల్లో అది గౌరవంగా భావిస్తా."

- సానియా మిర్జా, భారత టెన్నిస్ క్రీడాకారిణి

2018లో ఇజాన్​కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్​ గెలిచి సెకండ్​ ఇన్నింగ్స్​ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్​బోర్న్​ ఇంటర్నేషనల్​ ఈవెంట్​లో తొలి రౌండ్​లోనే సానియా జోడీ నిష్క్రమించింది. ప్రస్తుతం నెల వ్యవధిలో జరగనున్న వింబుల్డన్, ఒలింపిక్స్​లపై దృష్టి సారించింది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పింది.

'కోర్టు లోపల, బయట కఠోర సాధన చేస్తున్నా. చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి శ్రమిస్తున్నా. డబుల్స్​లో అంకితా రైనాతో జతకట్టడం సంతోషంగా ఉంది. టాప్​ 100లో ఉన్న భారత క్రీడాకారిణితో ఒలింపిక్స్​కు వెళ్లడం ఇదే తొలిసారి' అని సానియా తెలిపింది.

ఇదీ చూడండి: 'ఆ సమయంలో కారణం లేకుండానే కన్నీళ్లు వచ్చేవి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.