సానియా మీర్జా, కరోలిన్ గార్సియా (ఫ్రాన్స్) జోడి దుబాయ్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో.. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. తొలి రౌండ్లో సానియా జంట 6-4, 4-6, 10-8 తేడాతో కుద్రివత్సెవా (రష్యా), కేతరినా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జోడిపై విజయం సాధించింది. తర్వాత మ్యాచ్లో ఐదోసీడ్ సాయ్సై జెంగ్ (చైనా)-బార్బరా రెసికోవా (చెక్ రిపబ్లిక్) జంటతో సానియా జోడి అమీతుమీ తేల్చుకోనుంది.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన 33 ఏళ్ల సానియా.. రీఎంట్రీలోనే టైటిల్ కొట్టి సత్తా చాటింది. హోబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ మహిళల డబుల్స్లో నదియా(ఉక్రెయిన్)తో కలిసి ఛాంపియన్గా అవతరించింది. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్లో బరిలోకి దిగాలని భావిస్తోందీ హైదరాబాద్ అమ్మడు.