ETV Bharat / sports

త్వరలో ఆస్ట్రేలియన్ ఓపెన్.. క్వారంటైన్​లో ప్లేయర్లు - ఆస్ట్రేలియా ఓపెన్​కు రంగం సిద్ధం

ఆస్ట్రేలియన్ ఓపెన్​కు అర్హత సాధించిన పలువురు ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో ఆతిథ్య దేశానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మ్యాచ్​లు మొదలు కానున్నాయి. అయితే టోర్నీలో ఆడాల్సిన బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో పాల్గొనేది అనుమానంగా మారింది.

aus
ఆస్ట్రేలియా ఓపెన్​
author img

By

Published : Jan 14, 2021, 10:16 PM IST

ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్​ పూర్తయింది. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే సింగిల్స్​ మెయిన్​ డ్రాలో పోటీ పడేందుకు 16 మంది పురుషులు, 16 మంది మహిళా ప్లేయర్లు అర్హత సాధించారు. ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న వీరందరూ, 14 రోజులు క్వారంటైన్​లో ఉండనున్నారు. అనంతరం కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్​గా తేలితేనే టోర్నీలో పాల్గొంటారు.

మెయిన్ డ్రాలో పాల్గొనే ఆటగాళ్లతో పాటు అర్హత టోర్నీలో చివరిదాకా పోరాడి ఓడిన మరో ఆరుగురు పురుషులు, ఆరుగులు మహిళా ప్లేయర్లు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. వీరందరూ క్వారంటైన్​లో ఉంటారు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు గాయాలు లేదా ఇతర కారణాల వల్ల తప్పుకుంటే ఆ స్థానాల్లో వీళ్లు ఆడే అవకాశముంటుంది.

ఈ టోర్నీలో ర్యాంకింగ్స్​ ఆధారంగా నేరుగా 104 మంది ఆటగాళ్లు, వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​, క్వాలిఫయర్స్​లో అర్హత సాధించిన వారు పోటీపడనున్నారు.

కరోనా పాజిటివ్​

టోర్నీ ప్రారంభానికి ముందు చేసిన వైద్య పరీక్షల్లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్ ఆండీ ముర్రే కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు ఆడేది సందేహంగా మారింది. విమానంలో ఆస్ట్రేలియా వెళ్లాల్సిన ముర్రే.. వైరస్​ సోకడం వల్ల లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ఆరోసారి నిరాశే.. క్వాలిఫయర్స్​లో అంకిత ఓటమి

ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయర్స్​ పూర్తయింది. ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభమయ్యే సింగిల్స్​ మెయిన్​ డ్రాలో పోటీ పడేందుకు 16 మంది పురుషులు, 16 మంది మహిళా ప్లేయర్లు అర్హత సాధించారు. ప్రత్యేక విమానంలో ఆస్ట్రేలియాకు చేరుకున్న వీరందరూ, 14 రోజులు క్వారంటైన్​లో ఉండనున్నారు. అనంతరం కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగటివ్​గా తేలితేనే టోర్నీలో పాల్గొంటారు.

మెయిన్ డ్రాలో పాల్గొనే ఆటగాళ్లతో పాటు అర్హత టోర్నీలో చివరిదాకా పోరాడి ఓడిన మరో ఆరుగురు పురుషులు, ఆరుగులు మహిళా ప్లేయర్లు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. వీరందరూ క్వారంటైన్​లో ఉంటారు. టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు గాయాలు లేదా ఇతర కారణాల వల్ల తప్పుకుంటే ఆ స్థానాల్లో వీళ్లు ఆడే అవకాశముంటుంది.

ఈ టోర్నీలో ర్యాంకింగ్స్​ ఆధారంగా నేరుగా 104 మంది ఆటగాళ్లు, వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​, క్వాలిఫయర్స్​లో అర్హత సాధించిన వారు పోటీపడనున్నారు.

కరోనా పాజిటివ్​

టోర్నీ ప్రారంభానికి ముందు చేసిన వైద్య పరీక్షల్లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్ ఆండీ ముర్రే కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు ఆడేది సందేహంగా మారింది. విమానంలో ఆస్ట్రేలియా వెళ్లాల్సిన ముర్రే.. వైరస్​ సోకడం వల్ల లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలిసింది.

ఇదీ చూడండి: ఆరోసారి నిరాశే.. క్వాలిఫయర్స్​లో అంకిత ఓటమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.