ETV Bharat / sports

ప్రపంచ ఛాంపియన్​ సింధుకు 'పద్మభూషణ్​'

author img

By

Published : Jan 25, 2020, 9:56 PM IST

Updated : Feb 18, 2020, 10:03 AM IST

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి, చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెకు దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

PV Sindhu has been conferred the Padma Bhushan
తెలుగమ్మాయి సింధుకు 'పద్మభూషణ్​'

తెలుగు షట్లర్​, ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించిన పీవీ సింధు పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైంది. ఒలింపిక్‌ రజత పతక విజేత అయిన సింధు పేరును 2017లోనే పద్మభూషణ్‌కు సిఫారసు చేశారు. కానీ తుది జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. 2015లో ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పద్మశ్రీ అవార్డు అందుకుంది.

అసాధారణ ప్రతిభ...

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు అసాధారణ ప్రతిభ చూపింది. ప్రకాశ్‌ పదుకొనే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు సాగిన నిరీక్షణకు 2013లో తెరదించుతూ కాంస్యం నెగ్గింది. అయితే తర్వాత ఇంకో మూడు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. రెండుసార్లు ఫైనల్లో గొప్పగా పోరాడి ఓడి రజతాలతో సరిపెట్టుకుంది. అయితే గతేడాది మాత్రం అయిదో పతకం రూపంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భారతదేశం తరఫున తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న బ్యాడ్మింటన్​ క్రీడాకారిణిగా పీవీ సింధుకు పేరు తెచ్చుకుంది.

World Champion shuttler PV Sindhu
పీవీ సింధు

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సింధు... మొత్తం రెండు రజతాలు, రెండు కాంస్యాలు, ఒక స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన జాంగ్​ నింగ్​ సరసన నిలిచిందీ తెలుగుతేజం.

తెలుగు షట్లర్​, ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం సాధించిన పీవీ సింధు పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైంది. ఒలింపిక్‌ రజత పతక విజేత అయిన సింధు పేరును 2017లోనే పద్మభూషణ్‌కు సిఫారసు చేశారు. కానీ తుది జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. 2015లో ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పద్మశ్రీ అవార్డు అందుకుంది.

అసాధారణ ప్రతిభ...

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు అసాధారణ ప్రతిభ చూపింది. ప్రకాశ్‌ పదుకొనే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు సాగిన నిరీక్షణకు 2013లో తెరదించుతూ కాంస్యం నెగ్గింది. అయితే తర్వాత ఇంకో మూడు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. రెండుసార్లు ఫైనల్లో గొప్పగా పోరాడి ఓడి రజతాలతో సరిపెట్టుకుంది. అయితే గతేడాది మాత్రం అయిదో పతకం రూపంలో స్వర్ణం సొంతం చేసుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో భారతదేశం తరఫున తొలి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్న బ్యాడ్మింటన్​ క్రీడాకారిణిగా పీవీ సింధుకు పేరు తెచ్చుకుంది.

World Champion shuttler PV Sindhu
పీవీ సింధు

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో సింధు... మొత్తం రెండు రజతాలు, రెండు కాంస్యాలు, ఒక స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో అత్యధిక పతకాలు సాధించిన జాంగ్​ నింగ్​ సరసన నిలిచిందీ తెలుగుతేజం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:
++VIDEO ONLY - SHOTLIST AND SCRIPTING INFORMATION TO FOLLOW++
1. 00:00
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE:
DURATION:
STORYLINE:
Last Updated : Feb 18, 2020, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.