ETV Bharat / sports

Olympics: భారత అథ్లెట్లపై దేశవ్యాప్త కార్యక్రమాలు

author img

By

Published : Jun 8, 2021, 9:51 PM IST

ఒలింపిక్స్​కు సంబంధించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్​ ఒలింపిక్స్​ అసోసియేషన్​లు నడుం బిగించాయి. ఈ మెగా ఈవెంట్​లో పాల్గొననున్న భారత అథ్లెట్ల గురించి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నాయి.

tokyo olympics, sports authority of india
టోక్యో ఒలింపిక్స్​, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

దేశవ్యాప్తంగా ఒలింపిక్స్​ గురించి అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority of India​)తో పాటు ఇండియన్​ ఒలింపిక్స్​ అసోసియేషన్(Indian Olympics Association)​లు ముందుకొచ్చాయి. టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)​లో భారత అథ్లెట్స్​ పాల్గొననున్న నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి.

సాయ్​, ఐఓఏ.. మెగా ఈవెంట్స్​కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్​ విజేతలకు సంబంధించి క్విజ్​, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద పాత్ర పోషించనున్నాయి.

జులై 25 నుంచి సెప్టెంబర్​ 5 వరకు టోక్యో ఒలింపిక్స్​ను నిర్వహించాలని సంకల్పించారు నిర్వాహకులు. 11 ఆటల కేటగిరీలో భారత్​ నుంచి ఈ మెగా ఈవెంట్​లో 100 మంది వరకు అథ్లెట్లు పాల్గొననున్నారు. మరో 25 మంది ఇంకా అర్హత సాధించే అవకాశం ఉంది. జూన్​ చివరి నాటికి ఆ వివరాలు వెలువడుతాయి. రియో వేదికగా 2016లో జరిగిన పారాలింపిక్స్​లో 19 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈ సారి ఆ సంఖ్య 26కి పెరిగింది. మరో 16 మంది అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: Athletics: ఒలింపిక్ ఛాంపియన్​పై ఐదేళ్ల నిషేధం

దేశవ్యాప్తంగా ఒలింపిక్స్​ గురించి అవగాహన కల్పించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority of India​)తో పాటు ఇండియన్​ ఒలింపిక్స్​ అసోసియేషన్(Indian Olympics Association)​లు ముందుకొచ్చాయి. టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics)​లో భారత అథ్లెట్స్​ పాల్గొననున్న నేపథ్యంలో ఈ మేరకు సంయుక్త నిర్ణయం తీసుకున్నాయి.

సాయ్​, ఐఓఏ.. మెగా ఈవెంట్స్​కు సంబంధించి పలు కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తాయి. ఒలింపిక్స్​ విజేతలకు సంబంధించి క్విజ్​, డిబేట్లు, చర్చలు, ఆర్టికల్స్, స్లోగన్లు, ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో సామాజిక మాధ్యమాలు కూడా పెద్ద పాత్ర పోషించనున్నాయి.

జులై 25 నుంచి సెప్టెంబర్​ 5 వరకు టోక్యో ఒలింపిక్స్​ను నిర్వహించాలని సంకల్పించారు నిర్వాహకులు. 11 ఆటల కేటగిరీలో భారత్​ నుంచి ఈ మెగా ఈవెంట్​లో 100 మంది వరకు అథ్లెట్లు పాల్గొననున్నారు. మరో 25 మంది ఇంకా అర్హత సాధించే అవకాశం ఉంది. జూన్​ చివరి నాటికి ఆ వివరాలు వెలువడుతాయి. రియో వేదికగా 2016లో జరిగిన పారాలింపిక్స్​లో 19 మంది అథ్లెట్లు పాల్గొనగా.. ఈ సారి ఆ సంఖ్య 26కి పెరిగింది. మరో 16 మంది అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: Athletics: ఒలింపిక్ ఛాంపియన్​పై ఐదేళ్ల నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.