ETV Bharat / sports

ఒలింపిక్​ నిర్వాహక కమిటీ అధ్యక్ష పదవికి మోరి రాజీనామా

author img

By

Published : Feb 12, 2021, 1:28 PM IST

టోక్యో ఒలింపిక్స్​, పారాలింపిక్స్​ ఆర్గనైజింగ్​ కమిటీ అధ్యక్ష పదవి నుంచి​ యోషిరో మోరి తప్పుకున్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోరి.. ఇటీవల క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ జపాన్​ వ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం అయిన నేపథ్యంలో 'రాజీనామా' నిర్ణయం తీసుకోక తప్పలేదు.

tokyo olympics chief mori steps down over sexist remarks
ఒలింపిక్​ నిర్వాహక కమిటీ అధ్యక్షుడి రాజీనామా

టోక్యో ఒలింపిక్స్​, పారాలింపిక్స్​ ఆర్గనైజింగ్​ కమిటీ చీఫ్​ యోషిరో మోరి.. శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మోరి. అప్పటినుంచి అతడి రాజీనామా కోసం జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో పాటు ప్రజలూ డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో మోరి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.

83 ఏళ్ల మోరి తన నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్​ సభ్యుల సమావేశంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్​ ఒలింపిక్స్​ మంత్రి సీకో హషిమోటో ధ్రువీకరించారు.

''గురువారం ఉదయం యోషిరో మోరి నుంచి నాకొక ఫోన్​ వచ్చింది. రాజీనామాపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం'' అని మంత్రి తెలిపారు.

కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన ఒలింపిక్స్​ను జపాన్​ వేదికగా జులై 23 నుంచి నిర్వహించనున్నారు. ఆగష్టు 8 నుంచి జరగాల్సిన పారాలింపిక్స్​ అదే నెల 24 నుంచి సెప్టెంబర్​ 5 వరకు జరగనుంది.

ఇదీ చదవండి: 'క్షమాపణలకు ఓకే.. రాజీనామాకు మాత్రం నో'

ఇదీ చదవండి: ఒలింపిక్‌ నిర్వాహక కమిటీ అధ్యక్షుడిపై వేటు?

టోక్యో ఒలింపిక్స్​, పారాలింపిక్స్​ ఆర్గనైజింగ్​ కమిటీ చీఫ్​ యోషిరో మోరి.. శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు మోరి. అప్పటినుంచి అతడి రాజీనామా కోసం జపాన్​ మాజీ ప్రధాని షింజో అబేతో పాటు ప్రజలూ డిమాండ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో మోరి తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కూడా చెప్పాడు. తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.

83 ఏళ్ల మోరి తన నిర్ణయాన్ని ఎగ్జిక్యూటివ్​ సభ్యుల సమావేశంలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జపాన్​ ఒలింపిక్స్​ మంత్రి సీకో హషిమోటో ధ్రువీకరించారు.

''గురువారం ఉదయం యోషిరో మోరి నుంచి నాకొక ఫోన్​ వచ్చింది. రాజీనామాపై తన నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నమ్మకాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాం'' అని మంత్రి తెలిపారు.

కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడిన ఒలింపిక్స్​ను జపాన్​ వేదికగా జులై 23 నుంచి నిర్వహించనున్నారు. ఆగష్టు 8 నుంచి జరగాల్సిన పారాలింపిక్స్​ అదే నెల 24 నుంచి సెప్టెంబర్​ 5 వరకు జరగనుంది.

ఇదీ చదవండి: 'క్షమాపణలకు ఓకే.. రాజీనామాకు మాత్రం నో'

ఇదీ చదవండి: ఒలింపిక్‌ నిర్వాహక కమిటీ అధ్యక్షుడిపై వేటు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.