ETV Bharat / state

గ్రూప్​-3 పరీక్ష కేంద్రంలో కుమార్తె - కిడ్నాప్ చేశామంటూ ఆగంతకుల ఫోన్ - వెళ్లి చూసేసరికి? - THREATENING CALL TO FATHER

గ్రూప్​-3 పరీక్ష కేంద్రంలో కుమార్తె - కిడ్నాప్​ చేశామంటూ ఆగంతకుల నుంచి తండ్రికి ఫోన్​ కాల్ - ఎగ్జామ్​ సెంటర్ వద్దకు వెళ్లి చూడగా పరీక్ష రాస్తున్న కుమార్తె - ఊపిరి పీల్చుకున్న కుటుంబసభ్యులు

Threatening Call to Father
Threatening Call (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 7:01 AM IST

Threatening Call to Father Saying Daughter has been Kidnapped : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌-2 ఎగ్జామ్స్​ నిర్వహించారు. మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్‌-1 పరీక్షకు 2,73,847 మంది, పేపర్‌-2 పరీక్షకు 2,72,173 మంది హాజరయ్యారు. మొత్తం ఈ పరీక్షలకు 50.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-3 పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షతో గ్రూప్‌-3 పరీక్షలు పూర్తవుతాయి.

పరీక్ష రాస్తున్న కుమార్తె - కిడ్నాప్ చేశామంటూ ఫోన్​ కాల్ : ఇదిలా ఉండగా, ఎగ్జామ్​ సెంటర్​లో కుమార్తె గ్రూప్​-3 పరీక్ష రాస్తుండగా, 'మీ బిడ్డను కిడ్నాప్​ చేశాం. రూ.20 వేలు పంపిస్తే వదిలిపెడతాం' అంటూ ఆగంతకుల నుంచి వచ్చిన ఫోన్​ కాల్​తో ఆ తండ్రి అవాక్కయ్యాడు. కాసేపటి ముందే సోదరుడు కుమార్తెను పరీక్ష కేంద్రం వద్ద దింపి రాగా, ఇంతలోనే కిడ్నాప్​నకు గురైందా అని కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. మహబూబాబాద్​లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్​ జిల్లా గుమ్మడూరుకు చెందిన డోలి వెంకటేశ్వర్లు కుమార్తె సంధ్య గ్రూప్​-3 పరీక్షలు రాస్తుంది. ఆదివారం తన సోదరుడు ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దింపి వచ్చాడు. 20 నిమిషాల్లో తండ్రి వెంకటేశ్వర్లుకు గుర్తు తెలియని నెంబర్​ నుంచి ఫోన్​ వచ్చింది. 'మీ కుమార్తెను కిడ్నాప్​ చేశాం. ఆమె బాగా ఏడుస్తోంది. కావాలంటే ఓసారి వినండి' అంటూ ఆగంతకులు గొంతు మార్చి మహిళ ఏడుస్తున్నట్లు వినిపించారు. రూ.20 వేలు పంపిస్తే విడిచిపెడతామంటూ డిమాండ్ చేశారు. వెంటనే తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి విషయం పోలీసులకు తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రం సిబ్బంది వెళ్లి చూడగా, హాలులో పరీక్ష రాస్తుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. 'భయపడాల్సిందేమీ లేదు, అదంతా సైబర్​ నేరగాళ్ల పని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి' అని పోలీసులు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పంపించారు.

గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ

Threatening Call to Father Saying Daughter has been Kidnapped : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1,365 గ్రూప్‌-3 సర్వీసుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు ఆదివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలి రోజున ఉదయం పేపర్‌-1, మధ్యాహ్నం పేపర్‌-2 ఎగ్జామ్స్​ నిర్వహించారు. మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్‌-1 పరీక్షకు 2,73,847 మంది, పేపర్‌-2 పరీక్షకు 2,72,173 మంది హాజరయ్యారు. మొత్తం ఈ పరీక్షలకు 50.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ తెలిపింది. ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-3 పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షతో గ్రూప్‌-3 పరీక్షలు పూర్తవుతాయి.

పరీక్ష రాస్తున్న కుమార్తె - కిడ్నాప్ చేశామంటూ ఫోన్​ కాల్ : ఇదిలా ఉండగా, ఎగ్జామ్​ సెంటర్​లో కుమార్తె గ్రూప్​-3 పరీక్ష రాస్తుండగా, 'మీ బిడ్డను కిడ్నాప్​ చేశాం. రూ.20 వేలు పంపిస్తే వదిలిపెడతాం' అంటూ ఆగంతకుల నుంచి వచ్చిన ఫోన్​ కాల్​తో ఆ తండ్రి అవాక్కయ్యాడు. కాసేపటి ముందే సోదరుడు కుమార్తెను పరీక్ష కేంద్రం వద్ద దింపి రాగా, ఇంతలోనే కిడ్నాప్​నకు గురైందా అని కుటుంబసభ్యులు భయాందోళనకు గురయ్యారు. మహబూబాబాద్​లో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

మహబూబాబాద్​ జిల్లా గుమ్మడూరుకు చెందిన డోలి వెంకటేశ్వర్లు కుమార్తె సంధ్య గ్రూప్​-3 పరీక్షలు రాస్తుంది. ఆదివారం తన సోదరుడు ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దింపి వచ్చాడు. 20 నిమిషాల్లో తండ్రి వెంకటేశ్వర్లుకు గుర్తు తెలియని నెంబర్​ నుంచి ఫోన్​ వచ్చింది. 'మీ కుమార్తెను కిడ్నాప్​ చేశాం. ఆమె బాగా ఏడుస్తోంది. కావాలంటే ఓసారి వినండి' అంటూ ఆగంతకులు గొంతు మార్చి మహిళ ఏడుస్తున్నట్లు వినిపించారు. రూ.20 వేలు పంపిస్తే విడిచిపెడతామంటూ డిమాండ్ చేశారు. వెంటనే తల్లిదండ్రులు పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి విషయం పోలీసులకు తెలిపారు. దీంతో పరీక్ష కేంద్రం సిబ్బంది వెళ్లి చూడగా, హాలులో పరీక్ష రాస్తుంది. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. 'భయపడాల్సిందేమీ లేదు, అదంతా సైబర్​ నేరగాళ్ల పని, ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి' అని పోలీసులు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి పంపించారు.

గ్రూప్- 4 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.