ETV Bharat / sports

'ఫిట్​ ఇండియా.. ప్రజా ఉద్యమంలా మారాలి'

author img

By

Published : Aug 14, 2020, 7:58 PM IST

దేశమంతా ఫిట్​గా ఉండాలనే ఆకాంక్షతో ఫిట్​ ఇండియా ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి అక్టోబరు 2 వరకు ఫ్రీడమ్​ రన్​ నిర్వహించనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు శుక్రవారం వర్చువల్​గా ప్రారంభించారు.

Sports Minister Rijiju virtually launches Fit India Freedom Run
'ఫిట్​ ఇండియా ఉద్యమం.. ప్రజా ఉద్యమంగా మారాలి'

దేశవ్యాప్తంగా లక్షల మంది పాల్గొనే 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్​ రన్​'ను వర్చువల్​గా ప్రారంభించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ప్రజలంతా ఫిట్​గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

"ఫ్రీడమ్​ రన్​లో పాల్గొనడానికి భారీ స్థాయిలో ఆసక్తి చూపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగులు సహా వారి కుటుంబాలను ఈ పరుగులో భాగం చేయడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రోజున గొప్ప నివాళిగా నిలిచిపోతుంది. ఈ ఫిట్​ ఇండియా ఉద్యమం.. ప్రజా ఉద్యమంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశించారు. అది సాకారం అవుతుందని నమ్మకముంది".

-కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

ప్రస్తుతం దేశమంతా కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా ఇందులో పాల్గొనే వారంతా తమకు అనువైన ప్రదేశాలని ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్నారు.

సాయుధ దళాలూ భాగమే

ఈ దేశవ్యాప్త పరుగులో సాయుధ దళాలైన బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్​), ఇండో-టిబెటియన్​ పోలీస్​ (ఐటీబీటీ), సెంట్రల్​ రిజర్వ్​ పోలీసు ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) భాగం కానున్నాయి. భారతీయ రైల్వే, సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ పాఠశాలలతో కలిసి వీరు ఫ్రీడమ్​ పరుగులో పాల్గొననున్నారు.

75 లక్షల మంది వాలంటీర్లు

నెహ్రూ యువ కేంద్ర సంగతాన్​ (ఎన్​వైకేఎస్​), నేషనల్​ సర్వీస్​ స్కీమ్​ (ఎన్​ఎస్​ఎస్​)కు సంబంధించిన 75 లక్షల మంది యువకులతో పాటు క్రీడా సంస్థలకు చెందిన వారంతా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు.

దేశవ్యాప్తంగా లక్షల మంది పాల్గొనే 'ఫిట్​ ఇండియా ఫ్రీడమ్​ రన్​'ను వర్చువల్​గా ప్రారంభించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్​ రిజిజు. ప్రజలంతా ఫిట్​గా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

"ఫ్రీడమ్​ రన్​లో పాల్గొనడానికి భారీ స్థాయిలో ఆసక్తి చూపుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఉద్యోగులు సహా వారి కుటుంబాలను ఈ పరుగులో భాగం చేయడం ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం రోజున గొప్ప నివాళిగా నిలిచిపోతుంది. ఈ ఫిట్​ ఇండియా ఉద్యమం.. ప్రజా ఉద్యమంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశించారు. అది సాకారం అవుతుందని నమ్మకముంది".

-కిరణ్​ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

ప్రస్తుతం దేశమంతా కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా ఇందులో పాల్గొనే వారంతా తమకు అనువైన ప్రదేశాలని ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం ఆగస్టు 15 నుంచి అక్టోబరు 2 వరకు నిర్వహించనున్నారు.

సాయుధ దళాలూ భాగమే

ఈ దేశవ్యాప్త పరుగులో సాయుధ దళాలైన బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్​ (బీఎస్​ఎఫ్​), ఇండో-టిబెటియన్​ పోలీస్​ (ఐటీబీటీ), సెంట్రల్​ రిజర్వ్​ పోలీసు ఫోర్స్​ (సీఆర్​పీఎఫ్​) భాగం కానున్నాయి. భారతీయ రైల్వే, సీబీఎస్​ఈ, ఐసీఎస్​ఈ పాఠశాలలతో కలిసి వీరు ఫ్రీడమ్​ పరుగులో పాల్గొననున్నారు.

75 లక్షల మంది వాలంటీర్లు

నెహ్రూ యువ కేంద్ర సంగతాన్​ (ఎన్​వైకేఎస్​), నేషనల్​ సర్వీస్​ స్కీమ్​ (ఎన్​ఎస్​ఎస్​)కు సంబంధించిన 75 లక్షల మంది యువకులతో పాటు క్రీడా సంస్థలకు చెందిన వారంతా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.