ETV Bharat / sports

1500 మీటర్ల పరుగులో భారత్​కు ​ 4 మెడల్స్​

author img

By

Published : Dec 3, 2019, 3:52 PM IST

నేపాల్​ వేదికగా జరుగుతోన్న 13వ దక్షిణాసియా క్రీడల్లో భారత్​ హవా కొనసాగుతోంది. మంగళవారం జరిగిన పలు పోటీల్లో భారత బృందం నాలుగు పతకాలు సాధించింది. ఇందులో ఓ స్వర్ణం, రెండు రజతాలు, ఓ కాంస్యం లభించింది.

Indian athletes win 4 medals in 1500m races of SAG
దక్షిణాసియా క్రీడల్లో భారత్​కు 4 పతకాలు

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. నేపాల్​లోని ఖాట్​మాండు​ వేదికగా జరిగిన రెండో రోజు పోటీల్లో... భారత అథ్లెట్లు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు.

స్వర్ణంతో సత్తా...

పురుషుల విభాగంలో జరిగిన 1500 మీటర్ల పరుగు పందేంలో భారత అథ్లెట్​ అజయ్‌ కుమార్‌ సారో స్వర్ణం సాధించాడు. పరుగును 3.54.18 సెకన్లలో పూర్తి చేశాడు. మరో భారత్​ అథ్లెట్​ అజీత్‌ కుమార్‌ 3.57.18 సెకన్లతో రజతం గెలిచాడు. ఇందులో నేపాల్‌ అథ్లెట్‌ టంకా కార్కి (3.50.20 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు.

మహిళలు రెండు...

మహిళల 1500 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి చందా (4.34.51 సెకన్లు) రజతం, మరో అథ్లెట్​ చిత్రా పలకీజ్‌ (4.35.46 సెకన్లు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. శ్రీలంక అమ్మాయి ఉడా కుబురలగె (4.34.34 సెకన్లు) పసిడి అందుకుంది.

ప్రస్తుతం భారత్‌ 21 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్న నేపాల్‌ 28 పతకాలో అగ్రస్థానంలో ఉంది. ఈ పోటీలు డిసెంబర్​ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి.

దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల పంట పండిస్తోంది. నేపాల్​లోని ఖాట్​మాండు​ వేదికగా జరిగిన రెండో రోజు పోటీల్లో... భారత అథ్లెట్లు నాలుగు పతకాలు కైవసం చేసుకున్నారు.

స్వర్ణంతో సత్తా...

పురుషుల విభాగంలో జరిగిన 1500 మీటర్ల పరుగు పందేంలో భారత అథ్లెట్​ అజయ్‌ కుమార్‌ సారో స్వర్ణం సాధించాడు. పరుగును 3.54.18 సెకన్లలో పూర్తి చేశాడు. మరో భారత్​ అథ్లెట్​ అజీత్‌ కుమార్‌ 3.57.18 సెకన్లతో రజతం గెలిచాడు. ఇందులో నేపాల్‌ అథ్లెట్‌ టంకా కార్కి (3.50.20 సెకన్లు) కాంస్యం అందుకున్నాడు.

మహిళలు రెండు...

మహిళల 1500 మీటర్ల పరుగులో భారత క్రీడాకారిణి చందా (4.34.51 సెకన్లు) రజతం, మరో అథ్లెట్​ చిత్రా పలకీజ్‌ (4.35.46 సెకన్లు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. శ్రీలంక అమ్మాయి ఉడా కుబురలగె (4.34.34 సెకన్లు) పసిడి అందుకుంది.

ప్రస్తుతం భారత్‌ 21 పతకాలతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు 6 స్వర్ణాలు, 11 రజతాలు, 4 కాంస్యాలు సాధించింది. క్రీడలకు ఆతిథ్యమిస్తున్న నేపాల్‌ 28 పతకాలో అగ్రస్థానంలో ఉంది. ఈ పోటీలు డిసెంబర్​ 1 నుంచి 10 వరకు జరగనున్నాయి.

New Delhi, Dec 03 (ANI): Finance Minister Nirmala Sitharaman today addressed India-Sweden Business Summit. She said, "We are going through a phase of responding to challenges Indian industries are facing." FM Sitharaman further supported government's fiscal steps taken between budgets during India-Sweden business summit on December 03. "Before budget 2020, we took a call that fiscal rewarding step we had to project didn't have to wait. Therefore, corporate tax cut was taken between two budgets. This step has made the Indian industry understand that this government commitment towards reform is very clearly laid out," she further added. India-Sweden business summit was inaugurated in the presence of King Carl XVI Gustaf of Sweden.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.