టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలేలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ జ్యోతి యాత్ర కార్యకలాపాల్లో పాల్గొన్న మరో ఆరుగురికి వైరస్ సోకింది. దీంతో బాధితుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు తెలిపారు. వీరందరూ మాస్కులు ధరించడం సహా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, మహమ్మారి బారిన పడ్డారని వెల్లడించారు. ప్రతిఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఒలింపిక్స్పై రోజుకో మాట
కరోనా మహమ్మారి పరిస్థితుల్లో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై రోజుకో మాట వినిపిస్తోంది. కొందరు అధికారులు జరుగుతుందని, మరికొందరు రద్దు అవుతుందని అంటున్నారు. టోక్యో వేదికగా ఒలింపిక్స్.. గత ఏడాదిలోనే జరగాలి. కరోనా కారణంగా ఈ సంవత్సరం జులై 23కి వాయిదా పడ్డాయి. మరి ఈసారైనా జరుగుతాయో లేదో?
ఇదీ చూడండి: 'కరోనా విజృంభిస్తే ఒలింపిక్స్ రద్దు!'