ETV Bharat / sports

ఆల్​ ఇంగ్లాండ్​ ఓపెన్​​ నుంచి సింధు ఔట్​.. మూడోసారి తొలి రౌండ్​లోనే..

author img

By

Published : Mar 15, 2023, 7:29 PM IST

భారత స్టార్​ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ పీవీ సింధు.. ఆల్​ ఇంగ్లండ్​ ఛాంపియన్​ షిప్​ నుంచి నిష్క్రమించింది. ఈ ఏడాది జరిగిన టోర్నీల్లో మూడో సారి తొలి రౌండ్​లోనే ఇంటి ముఖం పట్టింది.

Sindhu crashes out of All England Championship falls at first hurdle for third time this season
Sindhu crashes out of All England Championship falls at first hurdle for third time this season

రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆల్​ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. చైనాకు చెందిన జాంగ్​ యి మ్యాన్​తో జరిగిన మ్యాచ్​లో సింధు.. ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. 39 నిమిషాలు పాటిన సాగిన మ్యాచ్​లో సింధు.. 17-21 11-21 తేడాతో ఓడిపోయింది. 2023లో జరిగిన మూడు టోర్నీల్లో తొలి రౌండ్​లోనే ఆమె వెనుదిరిగింది. ఈ ఏడాది జనవరిలో మలేసియా ఓపెన్​లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ చేతిలో ఓడిపోయిన సింధు.. అదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది.

భారత మహిళల డబుల్స్ జోడీ జాలీ- గాయత్రీ గోపీచంద్ పుల్లెల.. తొలి రౌండ్​లో గెలిచారు. 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ థాయిలాండ్ జోంగ్‌కోల్ఫాన్ కితితారాకుల్-రవింద ప్రజోంగ్‌జాయ్‌పై 21-18 21-14 తేడాతో విజయం సాధించారు. ప్రీక్వార్టర్స్‌లో ఈ జోడీ జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా, సయాకా హిరోటా జంటతో తలపడనుంది. పురుషుల సింగిల్స్​లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తమ మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో.. పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్​తో తెగతెంపులు చేసుకుంది. నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్​లో శిక్షణ పొందిన ఆమె.. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వెతుకులాటలో పడింది. ఈ విషయాన్ని పార్క్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది సీజన్​ గొప్పగా ప్రారంభించని నేపథ్యంలో సింధు నిర్ణయాన్ని గౌరవిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ - సింధు ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్​గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు పర్సనల్​ కోచ్​గా మారాడు. పార్క్ కోచింగ్ శిక్షణలో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం, కామన్వెల్త్ గేమ్స్​లో గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది. కానీ కొంత కాలంగా సింధు వరుస పరాజయాలను అందుకుంటోంది. గతేడాది మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు బ్యాడ్మింటన్ కోర్టుకు దూరంగా ఉన్న ఆమె.. టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్​లోనూ పాల్గొనలేదు. సింధు కోచ్​గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సింధు వైఫల్యాలకు కోచ్​గా తానే బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆల్​ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించింది. చైనాకు చెందిన జాంగ్​ యి మ్యాన్​తో జరిగిన మ్యాచ్​లో సింధు.. ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. 39 నిమిషాలు పాటిన సాగిన మ్యాచ్​లో సింధు.. 17-21 11-21 తేడాతో ఓడిపోయింది. 2023లో జరిగిన మూడు టోర్నీల్లో తొలి రౌండ్​లోనే ఆమె వెనుదిరిగింది. ఈ ఏడాది జనవరిలో మలేసియా ఓపెన్​లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌ చేతిలో ఓడిపోయిన సింధు.. అదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లోనూ తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది.

భారత మహిళల డబుల్స్ జోడీ జాలీ- గాయత్రీ గోపీచంద్ పుల్లెల.. తొలి రౌండ్​లో గెలిచారు. 46 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఏడో సీడ్ థాయిలాండ్ జోంగ్‌కోల్ఫాన్ కితితారాకుల్-రవింద ప్రజోంగ్‌జాయ్‌పై 21-18 21-14 తేడాతో విజయం సాధించారు. ప్రీక్వార్టర్స్‌లో ఈ జోడీ జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా, సయాకా హిరోటా జంటతో తలపడనుంది. పురుషుల సింగిల్స్​లో లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ తమ మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించారు.

అయితే ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో.. పీవీ సింధు తన కోచ్ పార్క్ టే సాంగ్​తో తెగతెంపులు చేసుకుంది. నాలుగేళ్ల పాటు పార్క్ కోచింగ్​లో శిక్షణ పొందిన ఆమె.. ప్రస్తుతం కొత్త కోచ్ కోసం వెతుకులాటలో పడింది. ఈ విషయాన్ని పార్క్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది సీజన్​ గొప్పగా ప్రారంభించని నేపథ్యంలో సింధు నిర్ణయాన్ని గౌరవిస్తూ తానే స్వయంగా తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

2019 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ నుంచి పార్క్ టే సాంగ్ - సింధు ప్రయాణం మొదలైంది. మొదట్లో అతడిని మెన్స్ సింగిల్స్ కోచ్​గా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నియమించినా.. తర్వాత సింధు పర్సనల్​ కోచ్​గా మారాడు. పార్క్ కోచింగ్ శిక్షణలో సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్​లో కాంస్య పతకం, కామన్వెల్త్ గేమ్స్​లో గోల్డ్​ మెడల్​ను ముద్దాడింది. కానీ కొంత కాలంగా సింధు వరుస పరాజయాలను అందుకుంటోంది. గతేడాది మడమ గాయం కారణంగా చాలా కాలం పాటు బ్యాడ్మింటన్ కోర్టుకు దూరంగా ఉన్న ఆమె.. టోక్యోలో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్​లోనూ పాల్గొనలేదు. సింధు కోచ్​గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతూ పార్క్ కూడా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. సింధు వైఫల్యాలకు కోచ్​గా తానే బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.