భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్.. ఒమన్ ఓపెన్లో విజేతగా నిలిచాడు. 37 ఏళ్ల ఈ క్రీడాకారుడు.. దాదాపు పదేళ్ల తర్వాత ఐటీటీఎఫ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన తుదిపోరులో టాప్ సీడ్ మార్కస్ ఫ్రిటస్(పోర్చుగల్)పై గెలిచాడు. ఆరు రౌండ్ల పాటు జరిగిన ఈ పోరులో 6-11, 11-8, 12-10, 11-9, 3-11, 17-5 తేడాతో విజయం సాధించాడు. ఈ ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్కు వెళ్లేందుకు ఇతడికి మెరుగైన ర్యాంక్ లభించింది.
అంతకు ముందు సెమీస్లో వరుసగా రెండు సెట్లు ఓడిపోయినా శరత్.. ఆ తర్వాత అద్భుతంగా పోరాడి గెలిచాడు. కిరిల్ కచ్కోవ్(రష్యా)పై విజయం సాధించాడు. ఏడు రౌండ్లు పాటు జరిగిన ఈ మ్యాచ్ను 11-13, 11-13, 13-11, 11-9, 13-11, 8-11, 11-7 తేడాతో సొంతం చేసుకున్నాడు.
ఇదీ చూడండి : 'తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యా'