ETV Bharat / sports

మరో టైటిల్​ వేటలో దూసుకెళ్తున్న సింధు.. సెమీస్​లో శ్రీకాంత్​

author img

By

Published : Apr 8, 2022, 10:33 AM IST

Updated : Apr 8, 2022, 12:38 PM IST

Korea Open Sindhu: కొరియా ఓపెన్​లో భారత షట్లరు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్​ అదరగొట్టారు. క్వార్టర్​ ఫైనల్లో గెలిచి.. సెమీస్​లో ప్రవేశించారు.

PV Sindhu, Srikanth enters semifinals of Korea Open
PV Sindhu, Srikanth enters semifinals of Korea Open

Korea Open Sindhu: మరో టైటిల్​ వేటలో భారత స్టార్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు దూసుకెళ్తోంది. కొరియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో సెమీఫైనల్​కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్ మ్యాచ్​లో థాయ్​లాండ్​ షట్లర్​ బుసానన్​ను 21-10, 21-16తో చిత్తు చేసింది. వరుస సెట్లలో 44 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించడం విశేషం. ఈ షట్లర్​పై సింధు 17వ సారి తన రికార్డును మెరుగుపర్చుకుంది.

పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్​ ఇప్పటికే సెమీస్​ చేరాడు. స్థానిక షట్లర్​ సన్​ వాన్​ హోతో హోరాహోరీ పోరులో పైచేయి సాధించాడు. గంటకుపైగా సాగిన పోరాటంలో 21-12,18-21,21-12 తేడాతో ఓడించాడు. శ్రీకాంత్​ తనపై మెరుగైన రికార్డున్న ఆటగాడిపై గెలవడం విశేషం. మొత్తం ఇరువురూ 11 ఆడగా.. శ్రీకాంత్​ నాలుగింట్లోనే గెలిచాడు. చివరిగా తలపడ్డ 3 సార్లు ప్రత్యర్థిదే పైచేయి. ఇప్పుడు మాత్రం గెలుపు శ్రీకాంత్​నే వరించింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో శ్రీకాంత్​ రజత పతకం సాధించాడు. అదే ఫామ్​ను కొరియా ఓపెన్​లోనూ కొనసాగిస్తున్నాడు. మరోవైపు కొన్నినెలలుగా నిలకడగా ఆడుతున్న యువకెరటం లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.​

Korea Open Sindhu: మరో టైటిల్​ వేటలో భారత స్టార్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి పీవీ సింధు దూసుకెళ్తోంది. కొరియా ఓపెన్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో సెమీఫైనల్​కు చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్ మ్యాచ్​లో థాయ్​లాండ్​ షట్లర్​ బుసానన్​ను 21-10, 21-16తో చిత్తు చేసింది. వరుస సెట్లలో 44 నిమిషాల్లోనే మ్యాచ్​ను ముగించడం విశేషం. ఈ షట్లర్​పై సింధు 17వ సారి తన రికార్డును మెరుగుపర్చుకుంది.

పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్​ ఇప్పటికే సెమీస్​ చేరాడు. స్థానిక షట్లర్​ సన్​ వాన్​ హోతో హోరాహోరీ పోరులో పైచేయి సాధించాడు. గంటకుపైగా సాగిన పోరాటంలో 21-12,18-21,21-12 తేడాతో ఓడించాడు. శ్రీకాంత్​ తనపై మెరుగైన రికార్డున్న ఆటగాడిపై గెలవడం విశేషం. మొత్తం ఇరువురూ 11 ఆడగా.. శ్రీకాంత్​ నాలుగింట్లోనే గెలిచాడు. చివరిగా తలపడ్డ 3 సార్లు ప్రత్యర్థిదే పైచేయి. ఇప్పుడు మాత్రం గెలుపు శ్రీకాంత్​నే వరించింది. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో శ్రీకాంత్​ రజత పతకం సాధించాడు. అదే ఫామ్​ను కొరియా ఓపెన్​లోనూ కొనసాగిస్తున్నాడు. మరోవైపు కొన్నినెలలుగా నిలకడగా ఆడుతున్న యువకెరటం లక్ష్యసేన్ అనూహ్య ఓటమితో రెండో రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు.​

ఇవీ చూడండి: కోహ్లీలా అది చదవడం నేర్చుకోవాలి.. కెప్టెన్​కు శాస్త్రి సూచన

ధోనీకి షాక్​!.. అభ్యంతరకరంగా ఉన్న వీడియో తొలగింపు

Last Updated : Apr 8, 2022, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.