భారత్లో నేషనల్ బాస్కెట్బాల్ అసోషియేషన్ (ఎన్బీఏ) సందడి ముగిసింది. రెండు రోజుల పాటు బాస్కెట్బాల్ ప్రియుల్ని అలరించిన ఎగ్జిబిషన్ మ్యాచ్లకు తెరపడింది. తొలి రోజు ఉత్కంఠ పోరులో 132-131 తేడాతో శాక్రమెంటో కింగ్స్ను ఓడించిన ఇండియానా పేసర్స్.. రెండో మ్యాచ్లోనూ జయకేతనం ఎగరేసింది.
ముంబయిలో జరిగిన ఈ మ్యాచ్లో పేసర్స్ 130-106 తేడాతో కింగ్స్ను ఓడించింది. మ్యాచ్లో నాలుగు క్వార్టర్లలోనూ పేసర్స్ ఆధిపత్యమే సాగింది. అలిజ్ జాన్సన్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
భారత్లో ఎన్బీఏకు ఆదరణ పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి ఈ మ్యాచ్లు నిర్వహించారు. ఈ నెల 22న ప్రారంభమయ్యే ఎన్బీఏ కొత్త సీజన్కు ఈ మ్యాచ్లను పేసర్స్, కింగ్స్ సన్నాహకంగా ఉపయోగించుకున్నాయి. ఈ మ్యాచ్ల నిర్వహణ భారత్-అమెరికా సంబంధాల్లో చరిత్రాత్మక సందర్భమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. గత నెల ప్రధాని అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారత్లో ఎన్బీఏ మ్యాచ్ల గురించి ప్రస్తావించారు.
ఇవీ చూడండి.. తొలి టెస్టులో గెలుపు మాదే: ఫిలాండర్