భారత వెయిట్ లిఫ్టర్ రాఖీ హల్దర్ రెండు జాతీయ రికార్డులు సృష్టించింది. ఖతర్ దోహా వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ కప్లో 218 కేజీల బరువులెత్తి వ్యక్తిగత అత్యుత్తమ స్కోర్ నమోదు చేసింది. ఆదివారం రాత్రి జరిగిన మహిళల 64 కేజీల విభాగంలో కాంస్యం దక్కించుకుంది.
స్నాచ్ విభాగంలో 95 కేజీలు, క్లీన్ అండ్ జర్క్ పోటీలో 123 కేజీల బరువులెత్తి సత్తాచాటింది రాఖీ. జూన్లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో 214 కేజీల(64+120కేజీలు) బరువులెత్తి పసిడి సాధించింది.
ఈ ఒలింపిక్ అర్హత పోటీల్లో ఈ పతకంతో కలిపి భారత్కు మొత్తం మూడు పతకాలు లభించాయి. మీరాబాయి చాను స్వర్ణం నెగ్గగా, జెరెమీ లాల్రినుంగా రజతం సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాలంటే నవంబరు 2018 నుంచి ఏప్రిల్ 2020 వరకు మధ్య జరిగిన కనీసం ఆరు ఈవెంట్లలో పాల్గొని ఓ స్వర్ణం, ఓ రజతమైన నెగ్గాలి.
ఇదీ చదవండి: మిస్టర్ కూల్ క్రికెట్ ప్రస్థానానికి 15 ఏళ్లు