ETV Bharat / sports

అంచనాలు లేకున్నా... అనుకున్నది సాధించాం

author img

By

Published : Aug 31, 2020, 11:10 PM IST

Updated : Aug 31, 2020, 11:25 PM IST

చెస్​ ఒలంపియాడ్​లో తొలిసారి స్వర్ణం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు గ్రాండ్​ మాస్టర్​ కోనేరు హంపి. ఈ గెలుపు భారత్​లో చదరంగానికి మరింత ప్రాచుర్యం తీసుకొస్తుందని అభిప్రాయపడ్డారు. దీంతో పాటు పలు విషయాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

KONERU HUMPY
కోనేరు హంపి
కోనేరు హంపి

ప్రతిష్టాత్మక చెస్ ఒలంపియాడ్​లో తొలిసారి స్వర్ణం సాధించడం.. అత్యంత సంతోషాన్నిచ్చిందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చెప్పారు. ఈ టోర్నీకి ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ, కలసికట్టుగా విజయం సాధించామన్నారు. కీలకమైన సెమీస్ టై బ్రేకర్ లో.. భారత్ ను గెలిపించి ఫైనల్ చేర్చడం.. సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ గెలుపు భారత్ లో చదరంగానికి మరింత ప్రాచుర్యం తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. ఆనంద్ లాంటి అనుభవజ్ఞులు, హరికృష్ణ, హారిక వంటి ఛాంపియన్లు, విదిత్, దివ్య వంటి జూనియర్లతో కలిసి అద్భుత గెలుపును సొంతం చేసుకున్నామన్నారు. టోర్నీకి సంబంధించిన మరిన్ని అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ఎంతోమంది ప్రసిద్ధ ఆటగాళ్లు.. గ్రాండ్ మాస్టర్లు ఉన్నప్పటికీ.. చెస్ ఒలంపియాడ్ లో మన ప్రభావం చాలా తక్కువగా ఉంది. 96 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా స్వర్ణం గెలవడంపై మీ స్పందన ఏంటి..?

చెస్ ఒలంపియాడ్ ఎప్పుడూ కూడా మహిళలు, పురుషుల విభాగంలో వేర్వేరుగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా.. ఇద్దరికీ కలిపి నిర్వహించారు. ఇలా చేయడం అన్నది మనకు లాభించింది. అన్ని ఫార్మాట్లలోనూ.. టాప్ ప్లేయర్లు ఈ టీమ్ లో ఉన్నారు. తొలిదశలో మాకు ప్రధాన ప్రత్యర్థి చైనా. వారిపైన గెలిచి.. క్వార్టర్స్ కు రావడం కీలకపరిణామం. సెమీస్ వరకూ ప్రయాణం బాగానే జరిగింది. సెమీస్​లో కీలకమైన విజయాలు సాధించాల్సిన పరిస్థితిలో ఆనంద్, నేను, హారిక, విదిత్ విజయాలు సాధించి స్కోర్ సాధించగలిగాం. సెమిస్ ట్రై బ్రేక్ కు వెళ్లింది. అలాంటి కీలక మ్యాచ్ నేను ఆడాల్సి వచ్చింది. నల్లపావులను ఎంచుకున్నాను. ఆ గేమ్ ను గెలిచి.. టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లే అవకాశం నాకు దక్కింది. ఫైనల్ లో రష్యాతో తలపడ్డాం. కొన్ని సాంకేతిక అడ్డంకుల కారణంగా ఇద్దరినీ విజేతలుగా ప్రకటించారు.

మీరు దాదాపు పాతికేళ్లుగా చెస్ ఆడుతున్నారు. వ్యక్తిగత విజయాలు చాలా సాధించారు. ఇలా ఒక టీమ్ గా గెలవడం ఎలాంటి సంతృప్తినిచ్చింది...?

ఒక బృందంగా ఏషియన్ టీం చాంఫియన్ షిప్ గెలిచాం. ప్రైవేట్, ఫ్రొఫెషనల్ టోర్నమెంట్లలో కొన్ని టీం ఈవెంట్లలో గెలిచాం. కానీ.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. ఒలంపియాడ్​లో ఇలా పతకం సాధించడం మొదటిసారి. నేను ఇంతకు ముందు మూడు ఒలంపియాడ్లలో పాల్గొన్నాను. ఈ టోర్నమెంట్ మొత్తం బృంద సభ్యులు అందరూ అద్భుతంగా రాణించారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు విజయంలో కీలకపాత్ర పోషించారు.

మొదట రష్యాను విజేతగా ప్రకటించినప్పుడు .. మీకు ఎలా అనిపించింది..?

ఆ విషయం తెలిసినప్పుడు నేను ఒక గేమ్ మధ్యలో ఉన్నాను. నా స్క్రీన్ మీద మా వాళ్లు ఓడిపోయారని కనిపించింది. ఆ తర్వాతే నాకు ఏం జరిగిందో తెలిసింది. స్వర్ణం వస్తుందని మేం ఊహించలేదు. ప్లేయర్లుగా మా తప్పు లేదు కాబట్టి అప్పీల్ చేశాం. ఎలాంటి నిర్ణయం వస్తుందో మేం ఆలోచించలేదు. మేం రజతంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని నిర్ణయానికొచ్చేశాం. కానీ ఆ నిర్ణయం మాత్రం.. ప్రపంచ చెస్ సమాఖ్యదే..!

సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి భారత ఆటగాళ్లు ఇద్దరిలో ఒకరు కచ్చితంగా గెలిచే స్థానంలో.. మరొకరు మెరుగైన స్థితిలో ఉన్నారు అని చెబుతున్నారు. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణాన్ని పంచుకోవడం ఏమన్నా అసంతృప్తి కలిగించిందా..? అవి కచ్చితంగా భారత్ గెలవాల్సిన గేమ్​లేనా..?

మేం దాని గురించి ఆలోచించలేదు. రష్యా కచ్చితంగా భారత్ కంటే మెరుగైన టీమ్. ఫైనల్​కు వచ్చాక.. అవకాశాన్ని వినియోగించుకోవాలి... గట్టిపోటీ ఇవ్వాలి అని మాత్రమే అనుకున్నాం. సాంకేతిక సమస్యతో అలా జరగడం వల్ల.. దురదుష్టవశాత్తూ.. స్వర్ణాన్ని సాధించే అవకాశం కోల్పోయామని బాధపడ్డాం. చివరగా రెండు దేశాలను విజేతలుగా ప్రకటించడంపై సంతోషంగానే ఉన్నాం.

మొత్తం చెస్ ఒలంపియాడ్ లో వ్యక్తిగతంగా మీ ఆటతీరును మీరు ఎలా విశ్లేషిస్తారు?

ఆ సెమీఫైనల్​లో ట్రై బ్రేక్ ఆడి ఫైనల్ కు తీసుకెళ్లడం అన్నది చాలా సంతోషం అనిపించింది. అదే సమయంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే.. ఆ సమయంలో మొత్తం జట్టంతా నా పైనే ఆధారపడి ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా.. మేం అవకాశం కోల్పోతాం. ఆ పరిస్థితిని అధిగమించి ముందుకెళ్లడం అన్నది నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది.

ప్రపంచ ఛాంపియన్ షిప్​లలో గెలిచినా వ్యక్తిగతంగా ఎన్ని టైటిల్స్ గెలిచినా.. ఒలంపియాడ్​లో గెలవడం అన్నది చాలా ముఖ్యంగా చెబుతుంటారు. ఎందుకింత ప్రాధాన్యం ఈ టోర్నీకి..!?

ఎందుకంటే దాని పేరే ఒలంపియాడ్. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మేం ప్రపంచ ఛాంపియన్​షిప్​లలో కూడా ఇదే స్థాయిలో ఆడతాం. కొన్ని ప్రైవేట్ ఛాంపియన్ షిప్​లలో ఇంతకంటే పై స్థాయిల్లో కూడా ఆడతాం. వాటిలో గెలిచినప్పుడు ఇంత గుర్తింపు రాదు. ఒలంపియాడ్ కాబట్టే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

KONERU HUMPY
కోనేరు హంపి

అంటే ఒలంపిక్స్ గోల్డ్ మెడల్​తో సమానం అన్నమాట..!?

అంతే.. ! ఒలంపిక్స్ లో చెస్ లేదుకానీ.. ఇది దాదాపుగా అలాంటిదే. ఇందులో కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొంటాయి. అదే ఫార్మాట్​లో జరుగుతుంది. కాకపోతే దీనిని ప్రపంచ చెస్ సమాఖ్య నిర్వహిస్తుంది.

చెస్ ఒలంపియాడ్​లో ఇప్పటి వరకూ ఒక కాంస్యపతకం సాధించడం మినహా.. మన ట్రాక్ రికార్డు అంత బాగా లేదు. టోర్నమెంట్​కు ముందు మీ అంచనా ఏంటి..?

మేం ప్రిలిమినరీ రౌండ్స్ వరకే ఆలోచించాం. ఎందుకంటే .. కొన్ని నెలల కిందటే ఓన్ నేషన్స్ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ.. టీమ్ ఈవెంట్​లో పాల్గొన్నాం. విశ్వనాథన్ ఆనంద్, హరికృష్ణ, నేను, హారిక, విదిత్ మేమంతా ఉన్నాం. అక్కడ సరైన ఫలితం రాలేదు. అందుకని ఈ టోర్నమెంట్​పై మాకు ఆశలు లేవు. ముందు క్వాలిఫై అవ్వడంపైనే దృష్టి సారించాం. చైనాను ఓడించి నాకౌట్​కు అర్హత సాధించిన తర్వాత.. పతకంపై దృష్టి సారించాం.

ఈసారి టీమ్ లో విశ్వనాథన్ ఆనంద్ వంటి సీనియర్లతో పాటు.. జూనియర్లు కూడా ఉన్నారు. ఇలాంటి కలయికలో ఉన్న అనుకూలతలు.. ప్రతికూలతలు ఏంటి..?

ఇది ఒక కొత్త అనుభవం. విశ్వనాథన్ గారు చాలా సీనియర్. కొంతమంది జూనియర్లు.. 15ఏళ్ల వయసు వారు. ఆయన తన అనుభవాలను పంచుకునేవారు. జూనియర్లు చాలా అమాయకంగా ఉండేవారు. మొత్తం మీద చాలా ఆహ్లాదకరంగా ఉండేది.

వ్యక్తిగత గేమ్​లలో పూర్తిగా మీ ఆటమీదనే దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఇలా టీమ్ ఈవెంట్లలో ఆడుతున్నప్పుడు.. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు సమన్వయం ఎలా ఉంటుంది?

వ్యక్తిగత గేమ్​లు ఆడుతున్నప్పుడు... తీసుకునే నిర్ణయం ప్రభావం.. వ్యక్తిగతంగా మన మీదనే ఉంటుంది. కాబట్టి.. కొన్ని రిస్కులు తీసుకోగలుగుతాం. కానీ ఇక్కడ టీం ఈవెంట్లలో కొన్ని రిస్కులు చేయలేం. ఎందుకంటే మనం చిన్న తప్పు చేసినా .. మొత్తం టీమ్ నష్టపోతుంది కాబట్టి అలాంటి పనులు చేయలేం. అవి తప్ప మిగిలిన వ్యూహాలన్నీ మామూలుగానే ఉంటాయి. ఉదాహరణకు.. చైనాతో ఆడినప్పుడు.. టాప్ లో 4 బోర్డులను డ్రా చేశాం. అక్కడ రిస్కు తీసుకోలేదు. అక్కడ జూనియర్ల ద్వారా ఫలితం సాధించాలనుకున్నాం. ఆర్మేనియా, పోలండ్, వియత్నాంతో ఆడినప్పుడు టాప్ బోర్డులలో స్కోర్ సాధించాలనుకుని.. లక్ష్యంగా పెట్టుకుని అలాగే చేశాం.

90 లలో హరికృష్ణ, మీరు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నప్పుడు... అప్పట్లో పిల్లలంతా చెస్ బోర్డులు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్లు.. ఇప్పుడు ఆ స్థాయి ఉత్సాహం ఉందనుకుంటున్నారా..?

కచ్చితంగా ఉంది. కానీ ఆంధ్రాలో కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. మీరు చెప్పిన వాతావరణం ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా ఉంది. తర్వాత తరం గ్రాండ్ మాస్టర్లు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తున్నారు. మనకు ఇక్కడ టోర్నమెంట్లు.. నిర్వహించకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది యువ గ్రాండ్ మాస్టర్లు వచ్చారు. ఆంధ్రాలో హరికృష్ణ, నేను, హారిక, లలిత్​బాబు తర్వాత ఎవరూ కనిపించడం లేదు. తర్వాత తరంలో చాలా అంతరం కనిపిస్తోంది.

KONERU HUMPY
కోనేరు హంపి

దక్షణాదిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీరు, తమిళనాడులో ఉన్నవారు తప్పితే.. దేశవ్యాప్తంగా పెద్దగా ప్రోత్సాహం కనిపించడం లేదు. ఎందుకని?

ఈ విజయం చాలా మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. 1926లో చెస్ ఒలంపియాడ్ ప్రారంభమైతే.. భారత్ కు ఇంతవరకూ స్వర్ణం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ దీనివైపు చూస్తారు అనుకుంటున్నాను. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు చొరవ తీసుకుని ప్రోత్సాహం అందిస్తే కానీ.. ఈ క్రీడ అభివృద్ధి చెందదు. పెద్ద టోర్నమెంట్లకు వెళ్లాలంటే.. ఆర్థిక సాయం కూడా అవసరం.

మూడు నెలల క్రితం వన్ నేషన్స్ కప్​లో మీ ప్రదర్శన అంత బాగా లేదు. ఈ కొద్ది సమయంలోనే ఈ మార్పు ఎలా సాధ్యమైంది...?

ఇదంతా బృంద సామర్థ్యమే. ఒక్కోసారి మనం రాణించలేం. వన్ నేషన్స్ కప్ అనే టోర్నమెంట్ మొదటిసారిగా ఆన్​లైన్ లో జరిగింది. అక్కడి అనుభవం ఇక్కడ ఉపయోగపడింది.

మీ పాప పుట్టిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయం అనుకుంటా.. మీ పాప అహనాకు కు బహుమతిగా భావిస్తున్నారా..?

కచ్చితంగా పాప పుట్టాక అంతా బాగుంది. నేను ఎక్కువ టైటిల్స్ గెలిచాను. తనకిప్పుడు మూడేళ్లు . అన్నీ అర్థమవుతున్నాయి. ఈ గేమ్ అంతా ఆన్​లైన్ లో జరగడంతో ఇంట్లో ఉండి.. తను అంతా తెలుసుకుంది. సెమీస్ అప్పుడు అనుకుంటా.. ఇవాళ గెలిస్తే.. ఫస్ట్ వస్తాము.. లేకపోతే సెకండ్ ప్లేసులో ఉంటాం అని చెప్పాను. ఆ గేమ్ అయిపోయిన వెంటనే ఇవాళ నువ్వు గెలిచావా.. అని అడిగింది. సో.. తనకు అన్నీ తెలుస్తున్నాయి.

ఇది చూడండి 'దేశం మిమ్నల్ని చూసి గర్వపడుతోంది'

కోనేరు హంపి

ప్రతిష్టాత్మక చెస్ ఒలంపియాడ్​లో తొలిసారి స్వర్ణం సాధించడం.. అత్యంత సంతోషాన్నిచ్చిందని గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి చెప్పారు. ఈ టోర్నీకి ముందు ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ, కలసికట్టుగా విజయం సాధించామన్నారు. కీలకమైన సెమీస్ టై బ్రేకర్ లో.. భారత్ ను గెలిపించి ఫైనల్ చేర్చడం.. సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ గెలుపు భారత్ లో చదరంగానికి మరింత ప్రాచుర్యం తీసుకువస్తుందని అభిప్రాయపడ్డారు. ఆనంద్ లాంటి అనుభవజ్ఞులు, హరికృష్ణ, హారిక వంటి ఛాంపియన్లు, విదిత్, దివ్య వంటి జూనియర్లతో కలిసి అద్భుత గెలుపును సొంతం చేసుకున్నామన్నారు. టోర్నీకి సంబంధించిన మరిన్ని అనుభవాలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

ఎంతోమంది ప్రసిద్ధ ఆటగాళ్లు.. గ్రాండ్ మాస్టర్లు ఉన్నప్పటికీ.. చెస్ ఒలంపియాడ్ లో మన ప్రభావం చాలా తక్కువగా ఉంది. 96 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా స్వర్ణం గెలవడంపై మీ స్పందన ఏంటి..?

చెస్ ఒలంపియాడ్ ఎప్పుడూ కూడా మహిళలు, పురుషుల విభాగంలో వేర్వేరుగా జరుగుతుంది. మొట్టమొదటిసారిగా.. ఇద్దరికీ కలిపి నిర్వహించారు. ఇలా చేయడం అన్నది మనకు లాభించింది. అన్ని ఫార్మాట్లలోనూ.. టాప్ ప్లేయర్లు ఈ టీమ్ లో ఉన్నారు. తొలిదశలో మాకు ప్రధాన ప్రత్యర్థి చైనా. వారిపైన గెలిచి.. క్వార్టర్స్ కు రావడం కీలకపరిణామం. సెమీస్ వరకూ ప్రయాణం బాగానే జరిగింది. సెమీస్​లో కీలకమైన విజయాలు సాధించాల్సిన పరిస్థితిలో ఆనంద్, నేను, హారిక, విదిత్ విజయాలు సాధించి స్కోర్ సాధించగలిగాం. సెమిస్ ట్రై బ్రేక్ కు వెళ్లింది. అలాంటి కీలక మ్యాచ్ నేను ఆడాల్సి వచ్చింది. నల్లపావులను ఎంచుకున్నాను. ఆ గేమ్ ను గెలిచి.. టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లే అవకాశం నాకు దక్కింది. ఫైనల్ లో రష్యాతో తలపడ్డాం. కొన్ని సాంకేతిక అడ్డంకుల కారణంగా ఇద్దరినీ విజేతలుగా ప్రకటించారు.

మీరు దాదాపు పాతికేళ్లుగా చెస్ ఆడుతున్నారు. వ్యక్తిగత విజయాలు చాలా సాధించారు. ఇలా ఒక టీమ్ గా గెలవడం ఎలాంటి సంతృప్తినిచ్చింది...?

ఒక బృందంగా ఏషియన్ టీం చాంఫియన్ షిప్ గెలిచాం. ప్రైవేట్, ఫ్రొఫెషనల్ టోర్నమెంట్లలో కొన్ని టీం ఈవెంట్లలో గెలిచాం. కానీ.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ.. ఒలంపియాడ్​లో ఇలా పతకం సాధించడం మొదటిసారి. నేను ఇంతకు ముందు మూడు ఒలంపియాడ్లలో పాల్గొన్నాను. ఈ టోర్నమెంట్ మొత్తం బృంద సభ్యులు అందరూ అద్భుతంగా రాణించారు. ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరు విజయంలో కీలకపాత్ర పోషించారు.

మొదట రష్యాను విజేతగా ప్రకటించినప్పుడు .. మీకు ఎలా అనిపించింది..?

ఆ విషయం తెలిసినప్పుడు నేను ఒక గేమ్ మధ్యలో ఉన్నాను. నా స్క్రీన్ మీద మా వాళ్లు ఓడిపోయారని కనిపించింది. ఆ తర్వాతే నాకు ఏం జరిగిందో తెలిసింది. స్వర్ణం వస్తుందని మేం ఊహించలేదు. ప్లేయర్లుగా మా తప్పు లేదు కాబట్టి అప్పీల్ చేశాం. ఎలాంటి నిర్ణయం వస్తుందో మేం ఆలోచించలేదు. మేం రజతంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని నిర్ణయానికొచ్చేశాం. కానీ ఆ నిర్ణయం మాత్రం.. ప్రపంచ చెస్ సమాఖ్యదే..!

సాంకేతిక సమస్య తలెత్తిన సమయానికి భారత ఆటగాళ్లు ఇద్దరిలో ఒకరు కచ్చితంగా గెలిచే స్థానంలో.. మరొకరు మెరుగైన స్థితిలో ఉన్నారు అని చెబుతున్నారు. రష్యాతో కలిసి సంయుక్తంగా స్వర్ణాన్ని పంచుకోవడం ఏమన్నా అసంతృప్తి కలిగించిందా..? అవి కచ్చితంగా భారత్ గెలవాల్సిన గేమ్​లేనా..?

మేం దాని గురించి ఆలోచించలేదు. రష్యా కచ్చితంగా భారత్ కంటే మెరుగైన టీమ్. ఫైనల్​కు వచ్చాక.. అవకాశాన్ని వినియోగించుకోవాలి... గట్టిపోటీ ఇవ్వాలి అని మాత్రమే అనుకున్నాం. సాంకేతిక సమస్యతో అలా జరగడం వల్ల.. దురదుష్టవశాత్తూ.. స్వర్ణాన్ని సాధించే అవకాశం కోల్పోయామని బాధపడ్డాం. చివరగా రెండు దేశాలను విజేతలుగా ప్రకటించడంపై సంతోషంగానే ఉన్నాం.

మొత్తం చెస్ ఒలంపియాడ్ లో వ్యక్తిగతంగా మీ ఆటతీరును మీరు ఎలా విశ్లేషిస్తారు?

ఆ సెమీఫైనల్​లో ట్రై బ్రేక్ ఆడి ఫైనల్ కు తీసుకెళ్లడం అన్నది చాలా సంతోషం అనిపించింది. అదే సమయంలో తీవ్రమైన ఒత్తిడి కూడా ఉంది. ఎందుకంటే.. ఆ సమయంలో మొత్తం జట్టంతా నా పైనే ఆధారపడి ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా.. మేం అవకాశం కోల్పోతాం. ఆ పరిస్థితిని అధిగమించి ముందుకెళ్లడం అన్నది నిజంగా చాలా సంతోషాన్నిచ్చింది.

ప్రపంచ ఛాంపియన్ షిప్​లలో గెలిచినా వ్యక్తిగతంగా ఎన్ని టైటిల్స్ గెలిచినా.. ఒలంపియాడ్​లో గెలవడం అన్నది చాలా ముఖ్యంగా చెబుతుంటారు. ఎందుకింత ప్రాధాన్యం ఈ టోర్నీకి..!?

ఎందుకంటే దాని పేరే ఒలంపియాడ్. ఒక స్పోర్ట్స్ పర్సన్ గా మేం ప్రపంచ ఛాంపియన్​షిప్​లలో కూడా ఇదే స్థాయిలో ఆడతాం. కొన్ని ప్రైవేట్ ఛాంపియన్ షిప్​లలో ఇంతకంటే పై స్థాయిల్లో కూడా ఆడతాం. వాటిలో గెలిచినప్పుడు ఇంత గుర్తింపు రాదు. ఒలంపియాడ్ కాబట్టే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చింది.

KONERU HUMPY
కోనేరు హంపి

అంటే ఒలంపిక్స్ గోల్డ్ మెడల్​తో సమానం అన్నమాట..!?

అంతే.. ! ఒలంపిక్స్ లో చెస్ లేదుకానీ.. ఇది దాదాపుగా అలాంటిదే. ఇందులో కూడా ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొంటాయి. అదే ఫార్మాట్​లో జరుగుతుంది. కాకపోతే దీనిని ప్రపంచ చెస్ సమాఖ్య నిర్వహిస్తుంది.

చెస్ ఒలంపియాడ్​లో ఇప్పటి వరకూ ఒక కాంస్యపతకం సాధించడం మినహా.. మన ట్రాక్ రికార్డు అంత బాగా లేదు. టోర్నమెంట్​కు ముందు మీ అంచనా ఏంటి..?

మేం ప్రిలిమినరీ రౌండ్స్ వరకే ఆలోచించాం. ఎందుకంటే .. కొన్ని నెలల కిందటే ఓన్ నేషన్స్ కప్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తూ.. టీమ్ ఈవెంట్​లో పాల్గొన్నాం. విశ్వనాథన్ ఆనంద్, హరికృష్ణ, నేను, హారిక, విదిత్ మేమంతా ఉన్నాం. అక్కడ సరైన ఫలితం రాలేదు. అందుకని ఈ టోర్నమెంట్​పై మాకు ఆశలు లేవు. ముందు క్వాలిఫై అవ్వడంపైనే దృష్టి సారించాం. చైనాను ఓడించి నాకౌట్​కు అర్హత సాధించిన తర్వాత.. పతకంపై దృష్టి సారించాం.

ఈసారి టీమ్ లో విశ్వనాథన్ ఆనంద్ వంటి సీనియర్లతో పాటు.. జూనియర్లు కూడా ఉన్నారు. ఇలాంటి కలయికలో ఉన్న అనుకూలతలు.. ప్రతికూలతలు ఏంటి..?

ఇది ఒక కొత్త అనుభవం. విశ్వనాథన్ గారు చాలా సీనియర్. కొంతమంది జూనియర్లు.. 15ఏళ్ల వయసు వారు. ఆయన తన అనుభవాలను పంచుకునేవారు. జూనియర్లు చాలా అమాయకంగా ఉండేవారు. మొత్తం మీద చాలా ఆహ్లాదకరంగా ఉండేది.

వ్యక్తిగత గేమ్​లలో పూర్తిగా మీ ఆటమీదనే దృష్టి కేంద్రీకరించగలుగుతారు. ఇలా టీమ్ ఈవెంట్లలో ఆడుతున్నప్పుడు.. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఇలాంటప్పుడు సమన్వయం ఎలా ఉంటుంది?

వ్యక్తిగత గేమ్​లు ఆడుతున్నప్పుడు... తీసుకునే నిర్ణయం ప్రభావం.. వ్యక్తిగతంగా మన మీదనే ఉంటుంది. కాబట్టి.. కొన్ని రిస్కులు తీసుకోగలుగుతాం. కానీ ఇక్కడ టీం ఈవెంట్లలో కొన్ని రిస్కులు చేయలేం. ఎందుకంటే మనం చిన్న తప్పు చేసినా .. మొత్తం టీమ్ నష్టపోతుంది కాబట్టి అలాంటి పనులు చేయలేం. అవి తప్ప మిగిలిన వ్యూహాలన్నీ మామూలుగానే ఉంటాయి. ఉదాహరణకు.. చైనాతో ఆడినప్పుడు.. టాప్ లో 4 బోర్డులను డ్రా చేశాం. అక్కడ రిస్కు తీసుకోలేదు. అక్కడ జూనియర్ల ద్వారా ఫలితం సాధించాలనుకున్నాం. ఆర్మేనియా, పోలండ్, వియత్నాంతో ఆడినప్పుడు టాప్ బోర్డులలో స్కోర్ సాధించాలనుకుని.. లక్ష్యంగా పెట్టుకుని అలాగే చేశాం.

90 లలో హరికృష్ణ, మీరు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నప్పుడు... అప్పట్లో పిల్లలంతా చెస్ బోర్డులు తీసుకుని ప్రాక్టీస్ చేసేవాళ్లు.. ఇప్పుడు ఆ స్థాయి ఉత్సాహం ఉందనుకుంటున్నారా..?

కచ్చితంగా ఉంది. కానీ ఆంధ్రాలో కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. మీరు చెప్పిన వాతావరణం ఇప్పుడు తమిళనాడులో ఎక్కువగా ఉంది. తర్వాత తరం గ్రాండ్ మాస్టర్లు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తున్నారు. మనకు ఇక్కడ టోర్నమెంట్లు.. నిర్వహించకపోవడం, సరైన శిక్షణ లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా రావడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది యువ గ్రాండ్ మాస్టర్లు వచ్చారు. ఆంధ్రాలో హరికృష్ణ, నేను, హారిక, లలిత్​బాబు తర్వాత ఎవరూ కనిపించడం లేదు. తర్వాత తరంలో చాలా అంతరం కనిపిస్తోంది.

KONERU HUMPY
కోనేరు హంపి

దక్షణాదిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీరు, తమిళనాడులో ఉన్నవారు తప్పితే.. దేశవ్యాప్తంగా పెద్దగా ప్రోత్సాహం కనిపించడం లేదు. ఎందుకని?

ఈ విజయం చాలా మార్పు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. 1926లో చెస్ ఒలంపియాడ్ ప్రారంభమైతే.. భారత్ కు ఇంతవరకూ స్వర్ణం రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి అందరూ దీనివైపు చూస్తారు అనుకుంటున్నాను. ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు చొరవ తీసుకుని ప్రోత్సాహం అందిస్తే కానీ.. ఈ క్రీడ అభివృద్ధి చెందదు. పెద్ద టోర్నమెంట్లకు వెళ్లాలంటే.. ఆర్థిక సాయం కూడా అవసరం.

మూడు నెలల క్రితం వన్ నేషన్స్ కప్​లో మీ ప్రదర్శన అంత బాగా లేదు. ఈ కొద్ది సమయంలోనే ఈ మార్పు ఎలా సాధ్యమైంది...?

ఇదంతా బృంద సామర్థ్యమే. ఒక్కోసారి మనం రాణించలేం. వన్ నేషన్స్ కప్ అనే టోర్నమెంట్ మొదటిసారిగా ఆన్​లైన్ లో జరిగింది. అక్కడి అనుభవం ఇక్కడ ఉపయోగపడింది.

మీ పాప పుట్టిన తర్వాత సాధించిన అతిపెద్ద విజయం అనుకుంటా.. మీ పాప అహనాకు కు బహుమతిగా భావిస్తున్నారా..?

కచ్చితంగా పాప పుట్టాక అంతా బాగుంది. నేను ఎక్కువ టైటిల్స్ గెలిచాను. తనకిప్పుడు మూడేళ్లు . అన్నీ అర్థమవుతున్నాయి. ఈ గేమ్ అంతా ఆన్​లైన్ లో జరగడంతో ఇంట్లో ఉండి.. తను అంతా తెలుసుకుంది. సెమీస్ అప్పుడు అనుకుంటా.. ఇవాళ గెలిస్తే.. ఫస్ట్ వస్తాము.. లేకపోతే సెకండ్ ప్లేసులో ఉంటాం అని చెప్పాను. ఆ గేమ్ అయిపోయిన వెంటనే ఇవాళ నువ్వు గెలిచావా.. అని అడిగింది. సో.. తనకు అన్నీ తెలుస్తున్నాయి.

ఇది చూడండి 'దేశం మిమ్నల్ని చూసి గర్వపడుతోంది'

Last Updated : Aug 31, 2020, 11:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.