రెజ్లర్ సాగర్ హత్య కేసు(Chhatrasal Brawl Case)లో జూడో కోచ్ సుభాష్ను దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. సాగర్పై దాడి చేసిన వారిలో సుశీల్ సన్నిహితుడైన సుభాష్ ముఖ్యుడని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సుశీల్ కుమార్తో సహా 11 మందిని అరెస్టు చేశారు.
ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తును దిల్లీ పోలీసులు ముమ్మరం చేశారు. సుశీల్ పరారీలో ఉన్నప్పుడు అతనికి సహాయపడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. అయితే సాగర్ హత్య కేసులో 13 మంది ప్రమేయం ఉన్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించగా.. ఇప్పటివరకు వారిలో 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రెజ్లర్ సాగర్ హత్య కేసు: సుశీల్ సన్నిహితుడు అరెస్టు