ETV Bharat / sports

'కరోనాపై విజయానికి చిహ్నంగా ఒలింపిక్స్ నిర్వహణ' - కరోనా ఒలింపిక్స్​

కరోనా కారణంగా వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ కచ్చితంగా జరుగుతాయని జపాన్​ ప్రధాన మంత్రి యోషిండే సుగా స్పష్టం చేశారు. వైరస్​పై గెలిచామని చెప్పడానికి ఒలింపిక్స్​​ నిర్వహణే తమ ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు.

oly
ఒలింపిక్స్​
author img

By

Published : Jan 19, 2021, 8:17 AM IST

కరోనా వైరస్‌తో సంబంధం లేకుండా 2021 జులై 23నే టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమవుతాయని జపాన్​ ప్రధాన మంత్రి యోషిండే సుగా స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్‌ క్రీడలు వాయిదా పడ్డాయి. ఈ క్రీడల్ని సవరించిన తేదీల్లోనే యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇటీవలి కాలంలో జపాన్​లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఒలింపిక్స్​ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో సుగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాను త్వరలోనే నియంత్రణలోకి తీసుకొస్తామని.. అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరస్​పై గెలిచామని చెప్పడానికి ఒలింపిక్స్​​ నిర్వహణే తమ ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే నెల నుంచి వైరస్​ వ్యాక్సినేషన్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

కరోనా వైరస్‌తో సంబంధం లేకుండా 2021 జులై 23నే టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభమవుతాయని జపాన్​ ప్రధాన మంత్రి యోషిండే సుగా స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్‌ క్రీడలు వాయిదా పడ్డాయి. ఈ క్రీడల్ని సవరించిన తేదీల్లోనే యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.

ఇటీవలి కాలంలో జపాన్​లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఒలింపిక్స్​ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో సుగా ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనాను త్వరలోనే నియంత్రణలోకి తీసుకొస్తామని.. అందుకు తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరస్​పై గెలిచామని చెప్పడానికి ఒలింపిక్స్​​ నిర్వహణే తమ ధ్యేయమని ప్రతిజ్ఞ చేశారు. వచ్చే నెల నుంచి వైరస్​ వ్యాక్సినేషన్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.

ఇదీ చూడండి : 'అనుకున్న సమయానికే ఒలింపిక్స్'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.