ETV Bharat / sports

హంపిని హోటల్లో ఉండి ఆడమంటే..

author img

By

Published : Aug 25, 2020, 10:27 AM IST

ఆన్​లైన్​ చెస్​ ఒలింపియాడ్​లోని​ మిగతా మ్యాచ్​లకు హోటల్​ గదిని కేటాయించినట్లు తెలిపింది అఖిల భారత చెస్​ సమాఖ్య. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అందుకు నిరాకరించింది భారత గ్రాండ్​మాస్టర్ కోనేరు​ హంపి.

chess player hampi news
హంపి

ఆన్​లైన్​ చెస్​ ఒలింపియాడ్​ మ్యాచ్​ల సమయంలో విద్యుత్​, ఇంటర్నెట్​ ఇబ్బందులు తలెత్తకుండా కోనేరు హంపి, విదిత్​ గుజరాతీలకు అదనపు వసతులు కల్పించాలని నిర్ణయించింది అఖిల భారత చెస్​ సమాఖ్య(ఏఐసీఎఫ్​). వారిద్దరికీ తమ సొంత నగరాల్లోనే ఫైవ్​స్టార్​ హోటల్​లో గదులు కేటాయించనుంది. ఆదివారం చైనాపై విజయంతో పూల్​-ఏ అగ్రస్థానంలో నిలిచిన భారత్​.. క్వార్టర్​ ఫైనల్స్​కు దూసుకెళ్లింది.

మంగోలియాతో జరిగిన ఆరో రౌండ్​ పోరులో హంపి, విదిత్​లు.. ఇంటర్నెట్, విద్యుత్​ సరఫరా సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో మిగతా మ్యాచ్​లను నక్షత్ర హోటల్​ నుంచి ఆడాలని ఏఐసీఎఫ్​ సూచించింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో హోటల్​లో ఉండేందుకు హంపి నిరాకరించింది.

"మిగతా మ్యాచ్​లు హోటల్​ నుంచి ఆడొచ్చని హంపి, విదిత్​లతో సహా ఆందరికీ చెప్పాం. అయితే వారంతా ఇంటి నుంచి ఆడేందుకే మొగ్గుచూపారు." అని ఏఐసీఎఫ్​ కార్యదర్శి భరత్​సింగ్​ చౌహాన్​ తెలిపారు.

"మంగోలియాతో మ్యాచ్​కు ముందురోజు రాత్రంతా వర్షం కురిసింది. విత్యుత్​ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధికారులు సరిచేశారు. అయితే, ఇంటర్నెట్​ పనిచేయకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుత పరిస్థితుల్లో హోటల్​లో ఉంటలేను" అని హంపి వివరించింది. విదిత్​ కూడా ఒకటి లేదా రెండ్రోజుల్లో తన నిర్ణయాన్ని చెప్తానని స్పష్టం చేశాడు.

ఆన్​లైన్​ చెస్​ ఒలింపియాడ్​ మ్యాచ్​ల సమయంలో విద్యుత్​, ఇంటర్నెట్​ ఇబ్బందులు తలెత్తకుండా కోనేరు హంపి, విదిత్​ గుజరాతీలకు అదనపు వసతులు కల్పించాలని నిర్ణయించింది అఖిల భారత చెస్​ సమాఖ్య(ఏఐసీఎఫ్​). వారిద్దరికీ తమ సొంత నగరాల్లోనే ఫైవ్​స్టార్​ హోటల్​లో గదులు కేటాయించనుంది. ఆదివారం చైనాపై విజయంతో పూల్​-ఏ అగ్రస్థానంలో నిలిచిన భారత్​.. క్వార్టర్​ ఫైనల్స్​కు దూసుకెళ్లింది.

మంగోలియాతో జరిగిన ఆరో రౌండ్​ పోరులో హంపి, విదిత్​లు.. ఇంటర్నెట్, విద్యుత్​ సరఫరా సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో మిగతా మ్యాచ్​లను నక్షత్ర హోటల్​ నుంచి ఆడాలని ఏఐసీఎఫ్​ సూచించింది. అయితే కరోనా మహమ్మారి నేపథ్యంలో హోటల్​లో ఉండేందుకు హంపి నిరాకరించింది.

"మిగతా మ్యాచ్​లు హోటల్​ నుంచి ఆడొచ్చని హంపి, విదిత్​లతో సహా ఆందరికీ చెప్పాం. అయితే వారంతా ఇంటి నుంచి ఆడేందుకే మొగ్గుచూపారు." అని ఏఐసీఎఫ్​ కార్యదర్శి భరత్​సింగ్​ చౌహాన్​ తెలిపారు.

"మంగోలియాతో మ్యాచ్​కు ముందురోజు రాత్రంతా వర్షం కురిసింది. విత్యుత్​ సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అధికారులు సరిచేశారు. అయితే, ఇంటర్నెట్​ పనిచేయకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తింది. ప్రస్తుత పరిస్థితుల్లో హోటల్​లో ఉంటలేను" అని హంపి వివరించింది. విదిత్​ కూడా ఒకటి లేదా రెండ్రోజుల్లో తన నిర్ణయాన్ని చెప్తానని స్పష్టం చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.