పాతికేళ్లుగా భారత అథ్లెటిక్స్ ప్రధానకోచ్గా పనిచేస్తోన్న బహదూర్ సింగ్.. ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ వయసు పరిమితుల ఆధారంగా కాంట్రాక్టు పొడిగింపును నిరాకరించడం వల్ల బహదూర్ కోచ్గా వైదొలిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1995లో కోచ్గా జాతీయ శిబిరాల్లో చేరిన బహదూర్.. 25 ఏళ్లపాటు సుదీర్ఘంగా కోచ్గా వ్యవహరిస్తూ ఎక్కువ కాలం శిక్షకుడిగా పనిచేసిన ఘనతను సాధించారు. జాతీయ శిక్షణా శిబిరాల్లో కోచ్ల అత్యధిక వయసు పరిమితి 70కు మించి ఉండకూడదనే మార్గదర్శకాల ప్రకారం ఆ పదవిలో బహదూర్ కొనసాగించడానికి నిరాకరించింది క్రీడా మంత్రిత్వశాఖ.
కోచ్గా కాకపోయినా..
2010లో దిల్లీ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ రెండు స్వర్ణాలతో సహా 12 అథ్లెటిక్స్ పతకాలు సాధించింది. 2018లో జకార్తా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో 8 బంగారు పతకాలు, 9 రజతాలతో పాటు ట్రాక్, ఫీల్డ్ పోటీల్లో 20 పతకాలు సాధించింది భారత్. విశ్వసనీయ సమాచారం మేరకు బహదూర్ కోచ్ పదవికి రాజీనామా చేసినా.. భారత అథ్లెటిక్స్కు సలహాదారునిగా ఉంటారని తెలుస్తోంది.
పతకాలు.. పురస్కారాలు
74 ఏళ్ల బహదూర్ సింగ్.. 1978, 1982 ఆసియన్ గేమ్స్లో షాట్పుట్ విభాగంలో బంగారు పతకం సాధించారు. 1974 దిల్లీలో జరిగిన ఆసియన్ గేమ్స్లో రజత పతకాన్ని దక్కించుకున్నారు. ట్రాక్, ఫీల్డ్ మీట్స్లో కాంస్యం (1973), బంగారు (1975), కాంస్యం (1979), రజత (1981) పతకాలను గెలుచుకున్నారు బహదూర్. 1980లో జరిగిన మాస్కో ఒలింపిక్స్లో పాల్గొన్నారు. 1976లో అర్జున అవార్డు, 1983లో పద్మశ్రీ, 1998లో ద్రోణాచార్య పురస్కారాలతో భారత ప్రభుత్వం సత్కరించింది.
ఇదీచూడండి... టాప్-6: ధోనీ కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్లు