ETV Bharat / sports

Asian Games 2023 India Medals : ముగిసిన భారత జైత్రయాత్ర.. రికార్డు స్థాయిలో పతకాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2023, 7:46 PM IST

Updated : Oct 7, 2023, 10:35 PM IST

Asian Games 2023 India Medals : ఆసియా గేమ్స్‌ 2023లో భారత బృందం... అంచనాలను అందుకుంటూ కొత్త చరిత్ర సృష్టించింది. 28 గోల్డ్ మెడల్స్​, 38 రజతాలు, 41 కాంస్యాలతో.. మొత్తం 107 పతకాలతో ఆసియా గేమ్స్‌ను ఘనంగా ముగించింది. గతంలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాస్తూ ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌ అద్భుతం చేసింది. ఇవాళ ఒక్కరోజే భారత్‌ మొత్తం 12 పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ ముచ్చటగా మూడో స్వర్ణాన్ని దక్కించుకోగా, క్రికెట్‌, కబడ్డీ జట్లు కూడా పసిడి కాంతులు విరజిమ్మాయి.

Asian Games 2023 India Medals
Asian Games 2023 India Medals

Asian Games 2023 India Medals : చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. గతంతో ఎన్నడూ లేనని పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. మొత్తం 107 పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో కొత్త చరిత్ర లిఖించింది. రేపటితో(అక్టోబర్​ 8) ఆసియా గేమ్స్‌ ముగియనుండగా ఇప్పటికే భారత్ పోటీపడే విభాగాలన్నీ పూర్తయ్యాయి. చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 198 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్య పతకాలతో.. డ్రాగన్‌ తొలి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో, కొరియా మూడో స్థానంలో నిలిచాయి.

భారత్‌ శనివారం(సెప్టెంబర్ 7) ఒక్కరోజే ఆరు స్వర్ణ పతకాలు సహా 12 పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ ముచ్చటగా మూడో పసిడి పతకం సాధించింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దక్షిణకొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ విజయం సాధించి స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్‌ డియోటేల్‌ స్వర్ణం గెలుచుకోగా. అభిషేక్‌ రజతం సాధించాడు. చివరి నిమిషంలో.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్లో భారత్‌ 33-29 తేడాతో ఇరాన్‌పై గెలిచి.. స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి.. దక్షిణ కొరియా జంట చోయ్‌ సోల్‌ జియు-కిమ్‌ వన్‌ హోల్‌పై 21-18, 21-16 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పతకంతో ఆసియా క్రీడల బాడ్మింటన్‌లో స్వర్ణాన్ని నెగ్గిన తొలి భారత్‌ డబుల్స్‌ జోడీగా రికార్డు సాధించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">


టీమ్​ఇండియా పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన ఫైనల్ వర్షం వల్ల రద్దవ్వడంతో టీమ్​ఇండియా పసిడిని దక్కించుకుంది. అఫ్గాన్‌ కంటే ర్యాంకింగ్‌లో భారత్ ముందుండడంతో.... టీమ్​ఇండియాకు పసిడి దక్కింది. మహిళల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్‌..... 2-1 గోల్స్‌ తేడాతో గెలిచింది. పురుషుల రెజ్లింగ్‌ 86కిలోల విభాగంలో దీపక్‌ పూనియా.. తుది పోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. చెస్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో......... కూడిన మహిళల జట్టు.. రజత పతకం సాధించగా... ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కూడిన పురుషుల జట్టు కూడా రజత పతకం కైవసం చేసుకుంది. చెస్‌లో రెండు రజత పతకాలతో భారత్‌ ఆసియా గేమ్స్ 2023కు ఘనంగా వీడ్కోలు పలికింది.

Neeraj Chopra Asian Games 2023 : మార్పు మొదలైంది.. ఇక వదిలిపెట్టి వెళ్లడం జరగదు.. 'ఈటీవీ భారత్'​తో నీరజ్​ చోప్రా

Asian Games 2023 : ఆసియా క్రీడలు.. క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం

Asian Games 2023 India Medals : చైనా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌ను భారత్‌ ఘనంగా ముగించింది. గతంతో ఎన్నడూ లేనని పతకాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. మొత్తం 107 పతకాలతో భారత్‌ పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్యాలతో కొత్త చరిత్ర లిఖించింది. రేపటితో(అక్టోబర్​ 8) ఆసియా గేమ్స్‌ ముగియనుండగా ఇప్పటికే భారత్ పోటీపడే విభాగాలన్నీ పూర్తయ్యాయి. చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 198 స్వర్ణాలు, 108 రజతాలు, 71 కాంస్య పతకాలతో.. డ్రాగన్‌ తొలి స్థానంలో నిలిచింది. జపాన్ రెండో స్థానంలో, కొరియా మూడో స్థానంలో నిలిచాయి.

భారత్‌ శనివారం(సెప్టెంబర్ 7) ఒక్కరోజే ఆరు స్వర్ణ పతకాలు సహా 12 పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ ముచ్చటగా మూడో పసిడి పతకం సాధించింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దక్షిణకొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ విజయం సాధించి స్వర్ణం సాధించింది. ఇదే విభాగంలో అదితి గోపీచంద్ కాంస్యం సాధించింది. ఆర్చరీ పురుషుల విభాగంలో ఓజాస్‌ డియోటేల్‌ స్వర్ణం గెలుచుకోగా. అభిషేక్‌ రజతం సాధించాడు. చివరి నిమిషంలో.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కబడ్డీ ఫైనల్లో భారత్‌ 33-29 తేడాతో ఇరాన్‌పై గెలిచి.. స్వర్ణాన్ని ఒడిసిపట్టింది. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో భారత ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి.. దక్షిణ కొరియా జంట చోయ్‌ సోల్‌ జియు-కిమ్‌ వన్‌ హోల్‌పై 21-18, 21-16 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. ఈ పతకంతో ఆసియా క్రీడల బాడ్మింటన్‌లో స్వర్ణాన్ని నెగ్గిన తొలి భారత్‌ డబుల్స్‌ జోడీగా రికార్డు సాధించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">


టీమ్​ఇండియా పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో జరగాల్సిన ఫైనల్ వర్షం వల్ల రద్దవ్వడంతో టీమ్​ఇండియా పసిడిని దక్కించుకుంది. అఫ్గాన్‌ కంటే ర్యాంకింగ్‌లో భారత్ ముందుండడంతో.... టీమ్​ఇండియాకు పసిడి దక్కింది. మహిళల హాకీలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్‌..... 2-1 గోల్స్‌ తేడాతో గెలిచింది. పురుషుల రెజ్లింగ్‌ 86కిలోల విభాగంలో దీపక్‌ పూనియా.. తుది పోరులో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు. చెస్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలతో......... కూడిన మహిళల జట్టు.. రజత పతకం సాధించగా... ప్రజ్ఞానంద, అర్జున్‌లతో కూడిన పురుషుల జట్టు కూడా రజత పతకం కైవసం చేసుకుంది. చెస్‌లో రెండు రజత పతకాలతో భారత్‌ ఆసియా గేమ్స్ 2023కు ఘనంగా వీడ్కోలు పలికింది.

Neeraj Chopra Asian Games 2023 : మార్పు మొదలైంది.. ఇక వదిలిపెట్టి వెళ్లడం జరగదు.. 'ఈటీవీ భారత్'​తో నీరజ్​ చోప్రా

Asian Games 2023 : ఆసియా క్రీడలు.. క్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం

Last Updated : Oct 7, 2023, 10:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.