గతేడాది ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెల్చుకున్న భారత రన్నర్ గోమతి మరిముత్తుపై నాలుగేళ్ల నిషేధం విధించింది అథ్లెట్ ఇంటిగ్రిటీ యూనిట్. నిషేధిత ఉత్ప్రేరకం వాడి డోపింగ్ పరీక్షలో పట్టుబడిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
డోపింగ్లో శాంపిల్-ఏ పాజిటివ్గా తేలడం వల్ల గోమతిపై గతేడాది మేలో తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు శాంపిల్-బీ పరీక్షల్లోనూ ఆమె పాజిటివ్ అని తేలింది. దీంతో 2023 మే వరకు మరే ఇతర పరుగు పోటీల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
గతేడాది ఆసియా ఛాంపియన్షిప్లో 800 మీటర్ల పరుగు విభాగంలో పాల్గొని లక్ష్యాన్ని 2.70 నిమిషాల్లో ముగించింది బంగారు పతకం సాధించింది గోమతి. చైనాకు చెందిన వాంగ్ చున్యు, కజికిస్థాన్కు చెందిన మార్గరిటా ముకషేవ్ వంటి ఉత్తమ అథ్లెట్స్ను ఓడించింది.
2019 మార్చి 18 నుంచి మే 17 వరకు గోమతి పాల్గొన్న పోటీల ఫలితాలు అన్నింటిని రద్దు చేశారు. ఈమె సాధించిన పతకాలు, టైటిల్స్, ర్యాంకింగ్ పాయింట్లు, నగదు బహుమతులను త్వరలో జప్తు చేయనుంది ఏఐయూ.

ఇది చూడండి : టెస్టు జట్టులోకి స్టార్ బౌలర్ రీఎంట్రీ!