ఒమన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్(టీటీ) టోర్నీలో... భారత స్టార్ ప్లేయర్ అచంట శరత్ కమల్ తుది పోరుకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన సెమీస్ మ్యాచ్లో వరుసగా రెండు సెట్లు ఓడిపోయినా.. కీలక సమయంలో అద్భుతంగా పోరాడి రాణించాడు. ఫలితంగా కిరిల్ కచ్కోవ్(రష్యా)పై గెలుపొందాడు. ఏడు రౌండ్లు జరిగిన మ్యాచ్లో 11-13, 11-13, 13-11, 11-9, 13-11, 8-11, 11-7 తేడాతో గెలిచాడు.
37 ఏళ్ల ఈ తమిళ ప్లేయర్.. టైటిల్ పోరులో మార్కస్ ఫ్రిటస్(పోర్చుగల్)తో తలపడనున్నాడు. ఈ ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్కు వెళ్లేందుకు ఇతడికి మెరుగైన ర్యాంక్ లభిస్తుంది. 2010లో అంతర్జాతీయ టీటీ ఫెడరేషన్ నిర్వహించిన ఈజిప్ట్ ఓపెన్ చివరిగా ఫైనల్ చేరాడు శరత్. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఈ ఓపెన్లో టైటిల్ పోరులో నిలిచాడు.