ETV Bharat / sports

30 మంది అథ్లెట్లకు కరోనా పాజిటివ్​ - Patiala

పాటియాలాతో పాటు బెంగుళూరుకు చెందిన నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)​లో 30 మంది అథ్లెట్లకు కరోనా నిర్ధరణ అయ్యింది. మొత్తం 741 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఏ ఒక్కరూ ఒలింపిక్స్​కు అర్హత సాధించిన ఆటగాళ్లు లేకపోవడం శుభపరిణామం.

26 athletes test positive for COVID at NIS Patiala, but none Tokyo-bound
పాటియాలా ఎన్​ఐఎస్​లో 26 మంది అథ్లెట్లకు కొవిడ్
author img

By

Published : Mar 31, 2021, 6:14 PM IST

Updated : Mar 31, 2021, 6:29 PM IST

పాటియాలాతో పాటు బెంగుళూరుకు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)​లో 30 మంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. మొత్తం 741 మందికి పరీక్షలు నిర్వహించగా.. తాజా కేసులు బయటపడినట్లు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్​) వెల్లడించింది. వీరిలో 313 మందికి పరీక్షలు పాటియాలా ఎన్​ఐఎస్​లో చేయగా 26 కేసులు వచ్చాయి. మిగతా 428 టెస్ట్​లు బెంగుళూరు ఎన్ఐఎస్​లో నిర్వహించగా 4 కేసులు బయటపడ్డాయు. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన ఒక్క అథ్లెట్​ కూడా వీరిలో లేరు.

"పాటియాలాతో పాటు బెంగుళూరు జాతీయ క్రీడా సంస్థలలో ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించాం. మొత్తం 741 మందికి టెస్ట్​ చేయగా.. వారిలో 30 మంది ఆటగాళ్లకి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. వీరిలో ఏ ఒక్కరు కూడా ఒలింపిక్స్​కు వెళ్లే అథ్లెట్లు లేకపోవడం శుభపరిణామం. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ క్యాంపస్​లు మొత్తం శానిటైజ్ చేశాం."

- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.

వైరస్​ సోకిన వారిలో భారత పురుషుల బాక్సింగ్ ప్రధాన కోచ్ సీఏ కట్టప్ప, షాట్​పుట్ కోచ్ మొహిందర్ సింగ్ థిల్లాన్​లు ఉన్నారు. పాటియాలాలో వైరస్​ సోకిన 26 మందిలో 10 మంది.. కేవలం ట్రాక్ అండ్ ఫీల్డ్​ విభాగానికి చెందిన ఆటగాళ్లే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: 'ధోనీ సారథ్యంలో ఆడాలనేది ప్రతి ఆటగాడి కోరిక'

పాటియాలాతో పాటు బెంగుళూరుకు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)​లో 30 మంది ఆటగాళ్లు కొవిడ్ బారిన పడ్డారు. మొత్తం 741 మందికి పరీక్షలు నిర్వహించగా.. తాజా కేసులు బయటపడినట్లు స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్​) వెల్లడించింది. వీరిలో 313 మందికి పరీక్షలు పాటియాలా ఎన్​ఐఎస్​లో చేయగా 26 కేసులు వచ్చాయి. మిగతా 428 టెస్ట్​లు బెంగుళూరు ఎన్ఐఎస్​లో నిర్వహించగా 4 కేసులు బయటపడ్డాయు. టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించిన ఒక్క అథ్లెట్​ కూడా వీరిలో లేరు.

"పాటియాలాతో పాటు బెంగుళూరు జాతీయ క్రీడా సంస్థలలో ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించాం. మొత్తం 741 మందికి టెస్ట్​ చేయగా.. వారిలో 30 మంది ఆటగాళ్లకి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. వీరిలో ఏ ఒక్కరు కూడా ఒలింపిక్స్​కు వెళ్లే అథ్లెట్లు లేకపోవడం శుభపరిణామం. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఆ క్యాంపస్​లు మొత్తం శానిటైజ్ చేశాం."

- స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా.

వైరస్​ సోకిన వారిలో భారత పురుషుల బాక్సింగ్ ప్రధాన కోచ్ సీఏ కట్టప్ప, షాట్​పుట్ కోచ్ మొహిందర్ సింగ్ థిల్లాన్​లు ఉన్నారు. పాటియాలాలో వైరస్​ సోకిన 26 మందిలో 10 మంది.. కేవలం ట్రాక్ అండ్ ఫీల్డ్​ విభాగానికి చెందిన ఆటగాళ్లే కావడం గమనార్హం.

ఇదీ చదవండి: 'ధోనీ సారథ్యంలో ఆడాలనేది ప్రతి ఆటగాడి కోరిక'

Last Updated : Mar 31, 2021, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.