కొవిడ్ నేపథ్యంలో ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్న భారత హాకీ జట్టు.. తొలి విజయం నమోదు చేసింది. యూరప్ టూర్లో జర్మనీ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల టోర్నీలో తొలి మ్యాచ్లో ఆతిథ్య జట్టుపై 6-1 గోల్స్ తేడాతో ఇండియా గెలుపొందింది. గోల్కీపర్ పీఆర్ శ్రేజేష్ జట్టుకు నేతృత్వం వహించాడు.
12 నెలల తర్వాత ఆడుతున్న భారత జట్టు ప్రత్యర్థి టీమ్కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. గెలవాలన్న కసి వారి ఆటలో స్పష్టంగా కనిపించింది. ఇండియా తరఫున నీలకంఠ శర్మ(13వ నిమిషంలో), వివేక్ సాగర్ ప్రసాద్(27, 28వ నిమిషాలలో), లలిత్ కుమార్ ఉపాధ్యాయ (41వ నిమిషంలో), ఆకాశ్ దీప్ సింగ్(42వ నిమిషంలో), హర్మన్ప్రీత్ సింగ్(47వ నిమిషంలో)లు గోల్స్ చేశారు.
ఇరు జట్లలో తొలి గోల్ భారత్ తరఫున పెనాల్టీ కార్నర్ ద్వారా సాధించగా.. 14వ నిమిషంలో జర్మనీ మొదటి గోల్ కొట్టింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాత వివేక్ సాగర్ వరుసగా రెండు గోల్స్ సాధించడం వల్ల ఇండియా 3-1 ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఆతిథ్య టీమ్ను ఎక్కడా కోలుకోనివ్వలేదు.
తదుపరి మ్యాచ్ మార్చి 2న జర్మనీతోనే జరగనుంది. మార్చి 6,8 తేదీల్లో గ్రేట్ బ్రిటన్తో ఆడనుంది టీమ్ఇండియా.
ఇదీ చదవండి: చివరి టెస్టు కోసం నెట్స్లో శ్రమిస్తున్న భారత్