ETV Bharat / sports

సాకర్​ దిగ్గజం​ మెస్సీపై 3 నెలల నిషేధం

దక్షిణ అమెరికా ఫుట్​బాల్ కాన్​ఫెడరేషన్(కాన్​మెబోల్​) అర్జెంటీనా ఫుట్​బాల్ ఆటగాడు లియోనల్​ మెస్సీపై మూడు నెలల సస్పెన్షన్ విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

author img

By

Published : Aug 3, 2019, 11:06 AM IST

మెస్సీ

అర్జెంటీనా ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీపై సస్పెన్షన్ విధించింది దక్షిణ అమెరికా ఫుట్​బాల్ కాన్​ఫెడరేషన్. మూడు నెలలపాటు అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడకుండా నిషేధించింది. కోపా అమెరికా టోర్నీలో చిలీతో మ్యాచ్​ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మెస్సీకి 50వేల యూఎస్ డాలర్లు(రూ. 34లక్షల పైనే) జరిమానా విధించింది. నిషేధం వేటుతో సెప్టెంబర్​లో చిలీ, మెక్సికో... అక్టోబరులో జర్మనీతో మ్యాచ్​లకు మెస్సీ దూరం కానున్నాడు.

ఈ అంశంపై మెస్సీ కానీ, అర్జెంటీనా సాకర్ బోర్డు కానీ స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అప్పీలు చేసుకోడానికి వారికి ఇంకా అవకాశముంది. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన దక్షిణఅమెరికా ప్రపంచకప్​ అర్హత పోటీల్లో తొలి మ్యాచ్​కు దూరమయ్యాడు మెస్సీ. చిలీతో మ్యాచ్​లో పదే పదే రెడ్ కార్డుకు గురైన కారణంగా ఈ వేటు పడింది.

MESSI
మెస్సీ

అసలు మెస్సీ చేసిందేంటి?

కోపా అమెరికా టోర్నీలో బ్రెజిల్​పై అర్జింటీనా 2-0 తేడాతో ఓడింది. బ్రెజిల్​ను గెలిపించేందుకే ఈ టోర్నీ నిర్వహించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మెస్సీ. చిలీతో మ్యాచ్​ అనంతరం అవార్డుల ప్రదానోత్సవానికీ రాలేదు. "ఈ అవినీతిలో పాలు పంచుకోవాలనుకోవట్లేదని" అన్నాడు. ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు కూడా ఇచ్చాడు.

ఇది చదవండి: రొనాల్డో నాకు స్ఫూర్తినిచ్చాడు: విరాట్​ కోహ్లీ

అర్జెంటీనా ఫుట్​బాల్ స్టార్ లియోనల్ మెస్సీపై సస్పెన్షన్ విధించింది దక్షిణ అమెరికా ఫుట్​బాల్ కాన్​ఫెడరేషన్. మూడు నెలలపాటు అంతర్జాతీయ మ్యాచ్​లు ఆడకుండా నిషేధించింది. కోపా అమెరికా టోర్నీలో చిలీతో మ్యాచ్​ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

మెస్సీకి 50వేల యూఎస్ డాలర్లు(రూ. 34లక్షల పైనే) జరిమానా విధించింది. నిషేధం వేటుతో సెప్టెంబర్​లో చిలీ, మెక్సికో... అక్టోబరులో జర్మనీతో మ్యాచ్​లకు మెస్సీ దూరం కానున్నాడు.

ఈ అంశంపై మెస్సీ కానీ, అర్జెంటీనా సాకర్ బోర్డు కానీ స్పందించలేదు. సస్పెన్షన్ నిర్ణయాన్ని అప్పీలు చేసుకోడానికి వారికి ఇంకా అవకాశముంది. ఇప్పటికే వచ్చే ఏడాది మార్చిలో జరగాల్సిన దక్షిణఅమెరికా ప్రపంచకప్​ అర్హత పోటీల్లో తొలి మ్యాచ్​కు దూరమయ్యాడు మెస్సీ. చిలీతో మ్యాచ్​లో పదే పదే రెడ్ కార్డుకు గురైన కారణంగా ఈ వేటు పడింది.

MESSI
మెస్సీ

అసలు మెస్సీ చేసిందేంటి?

కోపా అమెరికా టోర్నీలో బ్రెజిల్​పై అర్జింటీనా 2-0 తేడాతో ఓడింది. బ్రెజిల్​ను గెలిపించేందుకే ఈ టోర్నీ నిర్వహించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు మెస్సీ. చిలీతో మ్యాచ్​ అనంతరం అవార్డుల ప్రదానోత్సవానికీ రాలేదు. "ఈ అవినీతిలో పాలు పంచుకోవాలనుకోవట్లేదని" అన్నాడు. ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు కూడా ఇచ్చాడు.

ఇది చదవండి: రొనాల్డో నాకు స్ఫూర్తినిచ్చాడు: విరాట్​ కోహ్లీ

Vardha (Maharashtra), Aug 02 (ANI): Maharashtra Chief Minister Devendra Fadnavis said that there might be disagreements in BJP-Shiv Sena alliance over distribution of seats but that doesn't worry him. Speaking on the drive of joining BJP, he said, "There is no dearth of capable workers in our party (BJP). All the people from Congress or NCP want to join our party. But I have said that we will only take selective people from those who are popular, or have a good track record. But we do not have space for everyone. We have put 'housefull' board. We will definitely have hurdles in seat distribution of BJP-Shiv Sena alliance."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.