ఐదోసారి జగుతున్న శాఫ్ ఛాంపియన్షిప్లో బుధవారం.. నేపాల్-శ్రీలంక మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. బిరత్నగర్లో జరిగిన ఈ మ్యాచ్లో నేపాల్ విజయం సాధించింది.
- మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. నేడు బంగ్లాదేశ్తో రెండో సెమీఫైనల్ ఆడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేపాల్తో తుదిపోరులో తలపడతుంది.
రికార్డులు...
శాఫ్ టోర్నమెంట్ను 2010లో ప్రారంభించారు. అప్పటి నుంచి భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. నాలుగు సీజన్లలో భారత్ ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. గత ఏడాది ఫైనల్లో బంగ్లాదేశ్తో తలపడి.. 3-1తో తేడాతో మట్టికరిపించి కప్పు సొంతం చేసుకుంది భారత్.
- అదే ఏడాది నవంబరులో 7-1 తేడాతో బంగ్లాను మళ్లీ ఓడించింది భారత్. ఫలితంగా 2020 ఒలింపిక్స్ క్వాలిఫయర్ తొలి రౌండుకు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ మయన్మార్లో జరగనుంది.