భారత ఫుట్బాల్ మాజీ ఆటగాడు, కోచ్.. సయిద్ షాహిద్ హకీమ్ (82) కర్ణాటక గుల్బర్గాలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన హకీమ్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హకీమ్ సాబ్గా గుర్తింపు పొందిన ఆయన.. భారత ఫుట్బాల్కు ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించారు.
వాయుసేనలో స్క్వాడ్రాన్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తించిన హకీమ్.. 1960 రోమ్ ఒలింపిక్స్లో తొలిసారి భారత ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో జట్టు కోచ్గా ఆయన తండ్రి సయిద్ అబ్దుల్ రహీమ్ ఉన్నారు. అయితే హకీమ్ జట్టులో ఉన్నా.. ఆ సమయంలో ఆడే అవకాశం రాలేదు. దేశీయ ఫుట్బాల్ టోర్నీల్లో కోచ్గా హకీమ్ కీలక పాత్ర పోషించారు. హకీమ్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ధ్యాన్చంద్ అవార్డు, ద్రోణాచార్య అవార్డులతో గౌరవించింది.
హకీమ్ మృతి పట్ల ఏఐఎఫ్ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ సంతాపం వ్యక్తం చేశారు. దేశంలో ఫుట్బాల్కు ఆదరణ పెరగడంలో హకీమ్ కృషి మరువలేనిది అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ఒలింపిక్స్లో ఎప్పటికీ చెక్కు చెరగని రికార్డులు!