ETV Bharat / sports

WTC Final: బౌలర్లతో కోహ్లీ.. బ్యాట్స్​మెన్​తో బుమ్రా!

author img

By

Published : Jun 15, 2021, 5:32 AM IST

డబ్ల్యూటీసీ ఫైనల్​ నిమిత్తం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో పలు ఫొటోలను షేర్ చేశారు. కెప్టెన్​ కోహ్లీ.. ఇషాంత్, సిరాజ్​తో ఉన్న ఫొటోను, పేసర్​ బుమ్రా.. రిషభ్, పుజారా, రోహిత్​తో ఉన్న ఫొటోను పెట్టారు.

virat kohli, mohammed siraj
విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. సోషల్​ మీడియాలోనూ చురుకుగానే వ్యవహరిస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేసర్​ జస్ప్రీత్ బుమ్రా.. సామాజిక మాధ్యమాల​ వేదికగా ఫొటోలను షేర్​ చేశారు.

ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్​, సిరాజ్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ. 'ఈ పేసర్లు ప్రతి రోజు ఆధిపత్యం చెలాయిస్తున్నారు' అనే క్యాప్షన్​ను దాని కింద పెట్టాడు. మరో ఆటగాడు బుమ్రా.. ఓపెనర్​ రోహిత్​తో పాటు పుజారా, రిషభ్​ పంత్​తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'మరొక గొప్ప ప్రాక్టీస్ సెషన్​ తర్వాత మా అందరి నవ్వులు' అని దాని కింద రాసుకొచ్చాడు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలోకి సెలెక్టర్లను అనవసరంగా లాగారు'

డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్​, కివీస్​.. తగినంత ప్రాక్టీస్ సాధించాయి. టీమ్ఇండియా మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్​ ఆడింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్కోరు బోర్డును వెల్లడించలేదు బీసీసీఐ. రోజు వారీగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మెన్ వివరాలతో పాటు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల పేర్లను తెలిపింది.

మరో జట్టు న్యూజిలాండ్.. ప్రతిష్ఠాత్మక ఫైనల్​కు ముందు ఇంగ్లాండ్​తో రెండు టెస్ట్​ల సిరీస్ ఆడింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్​లో పర్యటక కివీస్ గెలుపొందింది. దీంతో 22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్​ను కైవసం చేసుకుంది న్యూజిలాండ్. జూన్​ 18 నుంచి సౌథాంప్టన్​ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్ ప్రారంభం కానుంది. జూన్​ 23ను రిజర్వ్​ తేదీగా ప్రకటించింది ఐసీసీ.

ఇదీ చదవండి: ICC: టెస్టు​ ఛాంపియన్​షిప్ ఫైనల్​​ ప్రైజ్​మనీ ఎంతంటే?

ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లు.. సోషల్​ మీడియాలోనూ చురుకుగానే వ్యవహరిస్తున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు పేసర్​ జస్ప్రీత్ బుమ్రా.. సామాజిక మాధ్యమాల​ వేదికగా ఫొటోలను షేర్​ చేశారు.

ఫాస్ట్ బౌలర్లు ఇషాంత్​, సిరాజ్​తో ఉన్న ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ. 'ఈ పేసర్లు ప్రతి రోజు ఆధిపత్యం చెలాయిస్తున్నారు' అనే క్యాప్షన్​ను దాని కింద పెట్టాడు. మరో ఆటగాడు బుమ్రా.. ఓపెనర్​ రోహిత్​తో పాటు పుజారా, రిషభ్​ పంత్​తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'మరొక గొప్ప ప్రాక్టీస్ సెషన్​ తర్వాత మా అందరి నవ్వులు' అని దాని కింద రాసుకొచ్చాడు.

ఇదీ చదవండి: 'ఆ విషయంలోకి సెలెక్టర్లను అనవసరంగా లాగారు'

డబ్ల్యూటీసీ ఫైనల్​ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత్​, కివీస్​.. తగినంత ప్రాక్టీస్ సాధించాయి. టీమ్ఇండియా మూడు రోజుల ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్​ ఆడింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్కోరు బోర్డును వెల్లడించలేదు బీసీసీఐ. రోజు వారీగా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మెన్ వివరాలతో పాటు ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల పేర్లను తెలిపింది.

మరో జట్టు న్యూజిలాండ్.. ప్రతిష్ఠాత్మక ఫైనల్​కు ముందు ఇంగ్లాండ్​తో రెండు టెస్ట్​ల సిరీస్ ఆడింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్​లో పర్యటక కివీస్ గెలుపొందింది. దీంతో 22 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ గడ్డపై సిరీస్​ను కైవసం చేసుకుంది న్యూజిలాండ్. జూన్​ 18 నుంచి సౌథాంప్టన్​ వేదికగా టీమ్ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ మ్యాచ్ ప్రారంభం కానుంది. జూన్​ 23ను రిజర్వ్​ తేదీగా ప్రకటించింది ఐసీసీ.

ఇదీ చదవండి: ICC: టెస్టు​ ఛాంపియన్​షిప్ ఫైనల్​​ ప్రైజ్​మనీ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.