ETV Bharat / sports

WTC Final: వ్యాఖ్యానంలో సన్నీకి జోడీగా డీకే

author img

By

Published : Jun 6, 2021, 8:45 AM IST

ఈ నెల 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్​లో(WTC Final) దిగ్గజ క్రికెటర్​ గావస్కర్​తో కలిసి భారత సీనియర్ ఆటగాడు దినేష్ కార్తీక్​ వ్యాఖ్యానం చేయనున్నాడు. భారత్​ నుంచి ఎంపిక చేసిన బృందంలో సన్నీతో పాటు డీకే చోటు దక్కించుకున్నారు.

sunil gavaskar, dinesh karthik
సునీల్ గావస్కర్, దినేష్ కార్తీక్

భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్​షిప్ ఫైనల్(WTC Final) సందర్భంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్​కు తోడుగా టీమ్​ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానం చేయబోతున్నాడు. సౌథాంప్టన్​లో ఈనెల 18న ఆరంభమయ్యే ఈ చరిత్రాత్మక పోరులో వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది.

"నేను భారత క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న సమయంలో కార్తీక్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్​లో నాతో కలిసి వ్యాఖ్యానం చెప్పబోతున్నాడు. కామెంట్రీ బాక్స్​లోనూ డీకే రాణిస్తాడని అనుకుంటున్నా. అతడికి నా అభినందనలు" అని సన్నీ పేర్కొన్నాడు. కార్తీక్ కలిసి ఉన్న ఫొటోను కూడా సన్నీ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

"మీతో కలిసి కామెంట్రీ బాక్స్​ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అభినందనలకు కృతజ్ఞతలు'' అంటూ డీకే బదులిచ్చాడు. ప్రస్తుతం గావస్కర్​తో కలిసి కార్తీక్ సెర్బియాలో క్వారంటైన్​లో ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ ఆరంభానికి ముందు వీళ్లిద్దరూ ఇంగ్లాండ్​ బయల్దేరనున్నారు. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో భారత్ ఆడిన సిరీస్​లో కార్తీక్ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు.

ఇదీ చదవండి: 'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్​ ఒకడు'

భారత్-న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్టు చాంపియన్​షిప్ ఫైనల్(WTC Final) సందర్భంగా దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్​కు తోడుగా టీమ్​ఇండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వ్యాఖ్యానం చేయబోతున్నాడు. సౌథాంప్టన్​లో ఈనెల 18న ఆరంభమయ్యే ఈ చరిత్రాత్మక పోరులో వ్యాఖ్యాన బృందంలో భారత్ నుంచి సన్నీ, డీకేలకే చోటు దక్కింది.

"నేను భారత క్రికెట్ జట్టుకు సలహాదారుగా ఉన్న సమయంలో కార్తీక్ అరంగేట్రం చేశాడు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్స్​లో నాతో కలిసి వ్యాఖ్యానం చెప్పబోతున్నాడు. కామెంట్రీ బాక్స్​లోనూ డీకే రాణిస్తాడని అనుకుంటున్నా. అతడికి నా అభినందనలు" అని సన్నీ పేర్కొన్నాడు. కార్తీక్ కలిసి ఉన్న ఫొటోను కూడా సన్నీ ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు.

"మీతో కలిసి కామెంట్రీ బాక్స్​ను పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అభినందనలకు కృతజ్ఞతలు'' అంటూ డీకే బదులిచ్చాడు. ప్రస్తుతం గావస్కర్​తో కలిసి కార్తీక్ సెర్బియాలో క్వారంటైన్​లో ఉన్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్ ఆరంభానికి ముందు వీళ్లిద్దరూ ఇంగ్లాండ్​ బయల్దేరనున్నారు. ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లాండ్​తో భారత్ ఆడిన సిరీస్​లో కార్తీక్ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేశాడు.

ఇదీ చదవండి: 'నేటి మేటి టెస్టు బౌలర్లలో అశ్విన్​ ఒకడు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.