ETV Bharat / sports

WTC Final: 'ఫైనల్​ అలా జరిపితే బాగుండేది'

author img

By

Published : Jun 2, 2021, 7:37 PM IST

టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో 'బెస్ట్ ఆఫ్ త్రీ' పెట్టాల్సిందని కోచ్ రవిశాస్త్రి అన్నాడు. భవిష్యత్తులో ఈ విషయమై ఆలోచన చేయాలని ఐసీసీకి సూచించాడు.

WTC Final: 'ఫైనల్​ అలా జరిపితే బాగుండేది'
కోచ్ రవిశాస్త్రి

వరల్డ్ టెస్టు ఛాంఫియన్​షిప్(World Test Championship)​ విజేతను తేల్చేందుకు ఫైనల్లో 'బెస్ట్ ఆఫ్ త్రీ' విధానం ఉంటే బాగుండేది టీమ్​ఇండియా(Team india) కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా జరిగినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఫైనల్​ల్లో మూడు మ్యాచ్​ల విధానం పెట్టాలని సూచించాడు. ఇంగ్లాండ్​ బయలుదేరే ముందు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పంచుకున్నాడు శాస్త్రి.

"టెస్టు ఛాంపియన్​షిప్​ను కొనసాగించాలని ఐసీసీ(ICC) భావిస్తే.. ఫైనల్​లో ఒక్క మ్యాచ్​ కాకుండా 'బెస్ట్ ఆఫ్ త్రీ' పెడితే బాగుంటుంది. ఇక్కడివరకు వచ్చేందుకు భారత కుర్రాళ్లు చాలా శ్రమించారు. రాత్రికి రాత్రే దక్కిన విజయం ఇది కాదు"

ప్రస్తుతం స్వదేశంలో క్వారంటైన్​లో ఉన్న టీమ్​ఇండియా.. గురవారం వేకువజామున ఇంగ్లాండ్​కు పయనమవుతుంది. జూన్ 18న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిఫ్ ఫైనల్(WTC FINAL), ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడుతుంది.

ఇవీ చదవండి:

వరల్డ్ టెస్టు ఛాంఫియన్​షిప్(World Test Championship)​ విజేతను తేల్చేందుకు ఫైనల్లో 'బెస్ట్ ఆఫ్ త్రీ' విధానం ఉంటే బాగుండేది టీమ్​ఇండియా(Team india) కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతానికి ఇలా జరిగినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం ఫైనల్​ల్లో మూడు మ్యాచ్​ల విధానం పెట్టాలని సూచించాడు. ఇంగ్లాండ్​ బయలుదేరే ముందు మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పంచుకున్నాడు శాస్త్రి.

"టెస్టు ఛాంపియన్​షిప్​ను కొనసాగించాలని ఐసీసీ(ICC) భావిస్తే.. ఫైనల్​లో ఒక్క మ్యాచ్​ కాకుండా 'బెస్ట్ ఆఫ్ త్రీ' పెడితే బాగుంటుంది. ఇక్కడివరకు వచ్చేందుకు భారత కుర్రాళ్లు చాలా శ్రమించారు. రాత్రికి రాత్రే దక్కిన విజయం ఇది కాదు"

ప్రస్తుతం స్వదేశంలో క్వారంటైన్​లో ఉన్న టీమ్​ఇండియా.. గురవారం వేకువజామున ఇంగ్లాండ్​కు పయనమవుతుంది. జూన్ 18న ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిఫ్ ఫైనల్(WTC FINAL), ఆ తర్వాత ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్​ ఆడుతుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.