ETV Bharat / sports

సుశీల్​ కోసం వేట- చివరగా కనిపించింది అక్కడే!

భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ చివరిసారిగా పంజాబ్​లోని భఠిండాలో ఉన్నట్లు గుర్తించామని పోలీసు వర్గాలు తెలిపాయి. అతడి కోసం హరియాణా, పంజాబ్​లలో పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు వెల్లడించాయి.

author img

By

Published : May 22, 2021, 9:30 PM IST

sushil kumar, indian wrestler
సుశీల్ కుమార్, భారత స్టార్ రెజ్లర్

హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్.. చివరి లొకేషన్​ పంజాబ్​లోని భఠిండాలో కనుగొన్నట్లు దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతడి కోసం హరియాణా, పంజాబ్​లలో పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. మే 4న ఛత్రశాల్​ స్టేడియంలో మల్లయోధుడు సాగర్​ రానా హత్య జరిగిన నాటి నుంచి సుశీల్​ పరారీలో ఉన్నాడు.

ఇటీవల దిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం సుశీల్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది న్యాయస్థానం. ఈ కేసులో సుశీల్​ ప్రధాన నిందితుడన్న ఆరోపణలు బలంగా ఉండడం వల్ల అతడికి బెయిల్​ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

అంతకుముందు సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డును ప్రకటించారు పోలీసులు. అతనితో పాటు మరో నిందితుడు అజయ్ కుమార్​ కూడా పరారీలో ఉన్నాడు. అతనిపై కూడా రూ.50వేల రివార్డు ఉంది.

ఇదీ చదవండి: భారత బాక్సర్ల విమానం ల్యాండింగ్​కు దుబాయ్​ నో!

హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్​ సుశీల్​ కుమార్.. చివరి లొకేషన్​ పంజాబ్​లోని భఠిండాలో కనుగొన్నట్లు దిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. అతడి కోసం హరియాణా, పంజాబ్​లలో పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు పేర్కొన్నాయి. మే 4న ఛత్రశాల్​ స్టేడియంలో మల్లయోధుడు సాగర్​ రానా హత్య జరిగిన నాటి నుంచి సుశీల్​ పరారీలో ఉన్నాడు.

ఇటీవల దిల్లీ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం సుశీల్​ పిటిషన్​ దాఖలు చేశాడు. ఆ వ్యాజ్యాన్ని తిరస్కరించింది న్యాయస్థానం. ఈ కేసులో సుశీల్​ ప్రధాన నిందితుడన్న ఆరోపణలు బలంగా ఉండడం వల్ల అతడికి బెయిల్​ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.

అంతకుముందు సుశీల్ ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డును ప్రకటించారు పోలీసులు. అతనితో పాటు మరో నిందితుడు అజయ్ కుమార్​ కూడా పరారీలో ఉన్నాడు. అతనిపై కూడా రూ.50వేల రివార్డు ఉంది.

ఇదీ చదవండి: భారత బాక్సర్ల విమానం ల్యాండింగ్​కు దుబాయ్​ నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.