ETV Bharat / sports

IND VS SL: 'భారత జట్టు గెలిస్తే ఆశ్చర్యం అక్కర్లేదు'

author img

By

Published : Jun 6, 2021, 5:31 AM IST

Updated : Jun 6, 2021, 6:10 AM IST

శ్రీలంక పర్యటనకు వెళ్లే టీమ్​ఇండియా(TeamIndia) గెలిస్తే తానేమీ ఆశ్చర్యపోనని అన్నాడు మాజీ చీఫ్ సెలక్టర్​ ఎమ్​ఎస్కే ప్రసాద్(MSK Prasad). అద్భుత ప్రదర్శన చేసే యువ ఆటగాళ్లతో జట్టు బలంగా ఉందని కొనియాడాడు.

Srilanka Tour
శ్రీలంక పర్యటన

టీమ్​ఇండియా(TeamIndia) జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ లేకుండా యువ ఆటగాళ్లతో కూడిన పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్​ జట్టు లంకతో మ్యాచ్​లు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో భారత జట్టు గెలిస్తే తానేమీ ఆశ్చర్యపోనని మాజీ చీఫ్ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) అన్నాడు​. తమ కాలంతో పోలిస్తే ఈ టీమ్​లో ఆత్మవిశ్వాసం రెట్టింపు స్థాయిలో ఉందని ఉందని ప్రశంసించాడు.

"సూర్యకుమార్​ యాదవ్(Suryakumar Yadav), ఇషాన్ కిషన్(IshanKishan)​, సంజూ శాంసన్(sanjusamson)​ వంటి అద్భుత యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో ఉన్నారు. వారు తమకు దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని తామెంటో నిరూపించుకుంటారు. అవేష్​ ఖాన్(ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపిక) అతడు కూడా మంచి ప్రదర్శన చేస్తాడు. ఐపీఎల్​లో అద్భుతంగా ఆడాడు. అతడిని ఈ సిరీస్​లో చూడలేకపోవడం దురదృష్టకరం. అప్పట్లో మాకు ఉన్న నైపుణ్యాలు ఈ తరం క్రికెటర్లకు మెండుగా ఉన్నాయి. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం మా కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది"

-ఎమ్మెస్కే ప్రసాద్, టీమ్​ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్

అలానే టీమ్​ఇండియా బెంచ్​ బలంగా ఉందని ఎమ్మెస్కే తెలిపాడు​. వారిని ప్రత్యేక శిక్షణ ఇచ్చి తయారుచేసినట్లు పేర్కొన్నాడు. చాలా ఏళ్ల తర్వాత భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతుంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌, బుమ్రా, షమీ సహా 20 మందితో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం ఉంది. తెల్లబంతి స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంకకు త్వరలో వెళ్లనుంది. లంకతో మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్​ ఆడనుంది భారత్.

ఇదీ చూడండి: శ్రీలంకతో సిరీస్​.. టీమ్​ఇండియా కెప్టెన్ ఎవరు?

టీమ్​ఇండియా(TeamIndia) జులైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లీ, స్టార్ ఓపెనర్ రోహిత్​ శర్మ లేకుండా యువ ఆటగాళ్లతో కూడిన పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్​ జట్టు లంకతో మ్యాచ్​లు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో భారత జట్టు గెలిస్తే తానేమీ ఆశ్చర్యపోనని మాజీ చీఫ్ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad) అన్నాడు​. తమ కాలంతో పోలిస్తే ఈ టీమ్​లో ఆత్మవిశ్వాసం రెట్టింపు స్థాయిలో ఉందని ఉందని ప్రశంసించాడు.

"సూర్యకుమార్​ యాదవ్(Suryakumar Yadav), ఇషాన్ కిషన్(IshanKishan)​, సంజూ శాంసన్(sanjusamson)​ వంటి అద్భుత యువ ఆటగాళ్లు ఈ పర్యటనలో ఉన్నారు. వారు తమకు దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని తామెంటో నిరూపించుకుంటారు. అవేష్​ ఖాన్(ఇంగ్లాండ్​ పర్యటనకు ఎంపిక) అతడు కూడా మంచి ప్రదర్శన చేస్తాడు. ఐపీఎల్​లో అద్భుతంగా ఆడాడు. అతడిని ఈ సిరీస్​లో చూడలేకపోవడం దురదృష్టకరం. అప్పట్లో మాకు ఉన్న నైపుణ్యాలు ఈ తరం క్రికెటర్లకు మెండుగా ఉన్నాయి. అయితే ఆత్మవిశ్వాసం మాత్రం మా కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా ఉంది"

-ఎమ్మెస్కే ప్రసాద్, టీమ్​ఇండియా మాజీ చీఫ్ సెలక్టర్

అలానే టీమ్​ఇండియా బెంచ్​ బలంగా ఉందని ఎమ్మెస్కే తెలిపాడు​. వారిని ప్రత్యేక శిక్షణ ఇచ్చి తయారుచేసినట్లు పేర్కొన్నాడు. చాలా ఏళ్ల తర్వాత భారత్‌ రెండు జట్లుగా విడిపోయి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడబోతుంది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌, బుమ్రా, షమీ సహా 20 మందితో కూడిన జట్టు ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం ఉంది. తెల్లబంతి స్పెషలిస్టులతో కూడిన జట్టు శ్రీలంకకు త్వరలో వెళ్లనుంది. లంకతో మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్​ ఆడనుంది భారత్.

ఇదీ చూడండి: శ్రీలంకతో సిరీస్​.. టీమ్​ఇండియా కెప్టెన్ ఎవరు?

Last Updated : Jun 6, 2021, 6:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.