ETV Bharat / sports

Ind vs SA: మెరిసిన మంధాన, మిథాలీ.. దక్షిణాఫ్రికా లక్ష్యం 275

author img

By

Published : Mar 27, 2022, 10:04 AM IST

Women World Cup 2022: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్​ మ్యాచ్​లో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది భారత మహిళల జట్టు. సెమీస్​ చేరేందుకు కీలకమైన ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ అర్ధశతకాలతో రాణించగా, మిథాలీ రాజ్​ కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడింది.

ind vs sa
Women World Cup 2022

Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్​ చేరేందుకు కీలకమైన మ్యాచ్​లో టీమ్​ఇండియా అదరగొట్టింది. బ్యాటర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), కెప్టెన్ మిథాలీ రాజ్ (68)​ అర్ధశతకాలతో రాణించారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్​ మ్యాచ్​లో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది భారత్. సఫారీ బౌలర్లలో మసబతా క్లాస్​ 2, షబ్నిమ్​ ఇస్మైల్ 2​, క్రియో ట్రయాన్​, ఖాక చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది టీమ్​ఇండియా. ఓపెనర్లు మంధాన, షెఫాలీ వర్మ శుభారంభాన్ని అందించారు. 15వ ఓవర్లలో షెఫాలీ ఔట్​ కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా (2) కూడా వెంటనే పెవిలియన్​ బాటపట్టింది. దీంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత కెప్టెన్​ మిథాలీతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దింది మంధాన. ఆఖర్లో హర్మన్​ప్రీత్​ (48) కూడా మెరిసింది.

మిథాలీ రికార్డు: ప్రపంచకప్​లో అరుదైన రికార్డు నెలకొల్పింది సారథి మిథాలీ రాజ్​. ప్రపంచకప్​లో హాఫ్​ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలిచింది. అయితే వరల్డ్​కప్​లో అర్ధశతకం చేసిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా మిథాలీనే కావడం విశేషం.

  • Youngest Indian to score 50 in WC - Mithali Raj
    Oldest Indian to score 50 in WC - Mithali Raj

    Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P

    — BCCI Women (@BCCIWomen) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Women World Cup 2022: మిథాలీ సేన సెమీస్‌కు చేరుతుందా?

Women World Cup 2022: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీస్​ చేరేందుకు కీలకమైన మ్యాచ్​లో టీమ్​ఇండియా అదరగొట్టింది. బ్యాటర్లు స్మృతి మంధాన (71), షెఫాలీ వర్మ (53), కెప్టెన్ మిథాలీ రాజ్ (68)​ అర్ధశతకాలతో రాణించారు. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి లీగ్​ మ్యాచ్​లో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది భారత్. సఫారీ బౌలర్లలో మసబతా క్లాస్​ 2, షబ్నిమ్​ ఇస్మైల్ 2​, క్రియో ట్రయాన్​, ఖాక చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్​లో తొలుత టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది టీమ్​ఇండియా. ఓపెనర్లు మంధాన, షెఫాలీ వర్మ శుభారంభాన్ని అందించారు. 15వ ఓవర్లలో షెఫాలీ ఔట్​ కాగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన యస్తికా భాటియా (2) కూడా వెంటనే పెవిలియన్​ బాటపట్టింది. దీంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. ఆ తర్వాత కెప్టెన్​ మిథాలీతో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దింది మంధాన. ఆఖర్లో హర్మన్​ప్రీత్​ (48) కూడా మెరిసింది.

మిథాలీ రికార్డు: ప్రపంచకప్​లో అరుదైన రికార్డు నెలకొల్పింది సారథి మిథాలీ రాజ్​. ప్రపంచకప్​లో హాఫ్​ సెంచరీ సాధించిన అత్యంత పెద్ద వయస్కురాలిగా నిలిచింది. అయితే వరల్డ్​కప్​లో అర్ధశతకం చేసిన అత్యంత పిన్నవయస్కురాలు కూడా మిథాలీనే కావడం విశేషం.

  • Youngest Indian to score 50 in WC - Mithali Raj
    Oldest Indian to score 50 in WC - Mithali Raj

    Pure class, quality and longevity. Well done, skip @M_Raj03 🙌🏾🙌🏾 pic.twitter.com/4HbpjPm12P

    — BCCI Women (@BCCIWomen) March 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: Women World Cup 2022: మిథాలీ సేన సెమీస్‌కు చేరుతుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.