ETV Bharat / sports

'కోహ్లీ ముందు ఊరిస్తున్న రికార్డులు- సిరీస్​లో సెంచరీ పక్కా!'

author img

By

Published : Jan 19, 2022, 12:41 PM IST

Virat Kohli 71st Century: టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీ సెంచరీ నమోదు చేసి దాదాపు రెండేళ్లయింది. ఈ నేపథ్యంలో కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్. సౌతాఫ్రికాతో సిరీస్​లో విరాట్​ పక్కా సెంచరీ చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు వన్డేల్లో మరో 22 పరుగులు చేస్తే కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నాడు.

virat kohli
విరాట్ కోహ్లీ

Virat Kohli 71st Century: టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీ ప్రోటీస్‌ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్‌లో కచ్చితంగా శతకం నమోదు చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని కోహ్లీ.. ఈ సిరీస్‌లో శతక లోటును భర్తీ చేస్తాడని ఆయన పేర్కొన్నాడు.

"కేప్‌టౌన్‌, న్యూలాండ్స్‌ పిచ్‌లంటే కోహ్లీకి చాలా ఇష్టం. ఈ విషయాన్ని అతడు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ప్రస్తుత మూడు వన్డేల సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ కచ్చితంగా సెంచరీ బాదుతాడు. భారత జట్టులో అనుభవమున్న ఆటగాళ్లున్నారు. తొలి రెండు వన్డేలు జరగనున్న పార్ల్‌లోని బోలాండ్‌ పార్క్ పిచ్‌ భారత జట్టుకి కలిసి వస్తుందనుకుంటున్నాను. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో సొంతం చేసుకుంటుంది" అని మోర్కెల్ అంచనా వేశాడు.

భారత అభిమానులు కూడా కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదిలేసి భారం దించుకున్న కోహ్లీ.. ఈ సారైనా అభిమానుల కోరిక నెరవేరుస్తాడేమో చూడాలి. 2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో సొంతం చేసుకుంది. రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుని నడిపించనున్నాడు. ఇటీవల టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమ్ఇండియా.. ఎలాగైనా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది.

virat kohli
విరాట్ కోహ్లీ

మరో రికార్డుకు చేరువలో..

టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. నేటి నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లో మరో 22 పరుగులు చేస్తే.. సఫారీ జట్టుపై ప్రస్తుత టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, 26 పరుగులు చేస్తే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సాధించిన పరుగుల రికార్డును అధిగమించనున్నాడు.

దక్షిణాఫ్రికాలో 29 మ్యాచులు ఆడిన గంగూలీ 1,313 పరుగులు, 36 మ్యాచులు ఆడిన ద్రావిడ్‌ 1,309 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ 57 మ్యాచుల్లో 2,001 పరుగులు చేసి సఫారీ జట్టుపై అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 1287 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. పూర్తి స్థాయి బ్యాటర్‌గా కోహ్లీ ఆడుతున్న తొలి వన్డే సిరీస్‌ ఇదే. దీంతో అతడి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. 2019 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా కోహ్లీ శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 మ్యాచులు ఆడిన కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. వీటిలో 8 అర్ధ శతకాలున్నా.. వాటిని శతకాలుగా మలచలేకపోయాడు. ఈ సారైనా ఆ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతాడేమో చూడాలి.!

ఇదీ చదవండి:

దక్షిణాఫ్రికాకు షాక్.. వన్డే సిరీస్​కు దూరమైన రబాడ

Virat Kohli 71st Century: టీమ్‌ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్‌ కోహ్లీ ప్రోటీస్‌ జట్టుతో జరుగనున్న వన్డే సిరీస్‌లో కచ్చితంగా శతకం నమోదు చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు మోర్నీ మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని కోహ్లీ.. ఈ సిరీస్‌లో శతక లోటును భర్తీ చేస్తాడని ఆయన పేర్కొన్నాడు.

"కేప్‌టౌన్‌, న్యూలాండ్స్‌ పిచ్‌లంటే కోహ్లీకి చాలా ఇష్టం. ఈ విషయాన్ని అతడు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ప్రస్తుత మూడు వన్డేల సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ కచ్చితంగా సెంచరీ బాదుతాడు. భారత జట్టులో అనుభవమున్న ఆటగాళ్లున్నారు. తొలి రెండు వన్డేలు జరగనున్న పార్ల్‌లోని బోలాండ్‌ పార్క్ పిచ్‌ భారత జట్టుకి కలిసి వస్తుందనుకుంటున్నాను. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో సొంతం చేసుకుంటుంది" అని మోర్కెల్ అంచనా వేశాడు.

భారత అభిమానులు కూడా కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని వదిలేసి భారం దించుకున్న కోహ్లీ.. ఈ సారైనా అభిమానుల కోరిక నెరవేరుస్తాడేమో చూడాలి. 2017-18 దక్షిణాఫ్రికా పర్యటనలో భారత్‌ ఆరు వన్డేల సిరీస్‌ను 5-1 తేడాతో సొంతం చేసుకుంది. రెగ్యులర్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మ పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ జట్టుని నడిపించనున్నాడు. ఇటీవల టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమ్ఇండియా.. ఎలాగైనా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే కసితో బరిలోకి దిగుతోంది.

virat kohli
విరాట్ కోహ్లీ

మరో రికార్డుకు చేరువలో..

టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనతకు చేరువయ్యాడు. నేటి నుంచి జరగనున్న వన్డే సిరీస్‌లో మరో 22 పరుగులు చేస్తే.. సఫారీ జట్టుపై ప్రస్తుత టీమ్ఇండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌, 26 పరుగులు చేస్తే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సాధించిన పరుగుల రికార్డును అధిగమించనున్నాడు.

దక్షిణాఫ్రికాలో 29 మ్యాచులు ఆడిన గంగూలీ 1,313 పరుగులు, 36 మ్యాచులు ఆడిన ద్రావిడ్‌ 1,309 పరుగులతో రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ 57 మ్యాచుల్లో 2,001 పరుగులు చేసి సఫారీ జట్టుపై అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 1287 పరుగులతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవల అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. పూర్తి స్థాయి బ్యాటర్‌గా కోహ్లీ ఆడుతున్న తొలి వన్డే సిరీస్‌ ఇదే. దీంతో అతడి ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. 2019 ఆగస్టులో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చివరిసారిగా కోహ్లీ శతకం నమోదు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 మ్యాచులు ఆడిన కోహ్లీ ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. వీటిలో 8 అర్ధ శతకాలున్నా.. వాటిని శతకాలుగా మలచలేకపోయాడు. ఈ సారైనా ఆ భారీ ఇన్నింగ్స్‌ ఆడుతాడేమో చూడాలి.!

ఇదీ చదవండి:

దక్షిణాఫ్రికాకు షాక్.. వన్డే సిరీస్​కు దూరమైన రబాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.