ETV Bharat / sports

అఫ్గాన్ జట్టును చిత్తు చేసిన భారత్.. సెమీస్​కు అర్హత - ఇండియా పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్

దుబాయ్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో అఫ్గాన్​ను ఓడించిన భారత్.. అండర్-19 ఆసియాకప్ సెమీస్​లో అడుగుపెట్టింది. గ్రూప్​-ఏ నుంచి భారత్, పాక్.. సెమీస్​కు అర్హత సాధించాయి.

India U19 Asia Cup
టీమ్​ఇండియా అండర్-19 ఆసియాకప్
author img

By

Published : Dec 27, 2021, 9:28 PM IST

అండర్-19 ఆసియాకప్​లో టీమ్​ఇండియా సెమీస్​కు చేరింది. అఫ్గానిస్థాన్​పై తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో గెలిచి తర్వాతి సమరానికి సిద్ధమైంది.

సోమవారం జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. కెప్టెన్ సులేమాన్ సఫీ 73, అహ్మద్ జాయ్ 86 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్​వర్ధన్, రాజ్​, విక్కీ, కుశాల్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో భారత్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రఘువంశీ, హర్నూర్ సింగ్.. తొలి వికెట్​కు 104 పరుగులు జోడించారు. హర్నూర్ సింగ్ అత్యధికంగా 65 పరుగులు చేశాడు. 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది యువ భారత్.

గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్, గ్రూప్-బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక.. సెమీస్​కు అర్హత సాధించాయి. ఒకవేళ సెమీస్​ భారత్, పాక్​ గెలిస్తే.. ఫైనల్​లో దాయాదుల మధ్య పోరు చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

అండర్-19 ఆసియాకప్​లో టీమ్​ఇండియా సెమీస్​కు చేరింది. అఫ్గానిస్థాన్​పై తప్పక గెలవాల్సిన మ్యాచ్​లో గెలిచి తర్వాతి సమరానికి సిద్ధమైంది.

సోమవారం జరిగిన ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 259 పరుగులు చేసింది. కెప్టెన్ సులేమాన్ సఫీ 73, అహ్మద్ జాయ్ 86 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రాజ్​వర్ధన్, రాజ్​, విక్కీ, కుశాల్ తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో భారత్​కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు రఘువంశీ, హర్నూర్ సింగ్.. తొలి వికెట్​కు 104 పరుగులు జోడించారు. హర్నూర్ సింగ్ అత్యధికంగా 65 పరుగులు చేశాడు. 48.2 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తిచేసింది యువ భారత్.

గ్రూప్-ఏ నుంచి భారత్, పాకిస్థాన్, గ్రూప్-బీ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక.. సెమీస్​కు అర్హత సాధించాయి. ఒకవేళ సెమీస్​ భారత్, పాక్​ గెలిస్తే.. ఫైనల్​లో దాయాదుల మధ్య పోరు చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.