టీమ్ఇండియా టెస్టు బ్యాట్స్మన్ రహానె, అతడి భార్య రాధిక.. శనివారం, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని రహానె ఇన్స్టాలో వెల్లడించాడు. ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పాడు. అంతకుముందు టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్, కోచ్ రవిశాస్త్రి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.
రహానె.. ఈ ఏడాది జూన్ 18న ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడనున్నాడు.
ఇదీ చూడండి: క్రికెటర్ శిఖర్ ధావన్కు కరోనా టీకా తొలి డోసు