ETV Bharat / sports

T20 World Cup: పంత్​ X డీకే​.. తుది జట్టులో చోటు ఎవరికి దక్కుతుందో?

author img

By

Published : Nov 8, 2022, 3:44 PM IST

టీ20 ప్రపంచకప్‌ మరోసారి నెగ్గడానికి టీమ్‌ఇండియా రెండు మ్యాచ్‌ల దూరంలో ఉంది. ఫైనల్‌ బెర్త్‌ కోసం గురువారం అడిలైడ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్‌కు జట్టు కూర్పు కీలకంగా మారింది. సరైన టీమ్‌తో ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాలని టీమ్​ఇండియా కోరుకుంటోంది. తుదిజట్టులో రిషబ్‌ పంత్‌, దినేష్‌ కార్తీక్‌లలో ఎవరికి చోటు దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.

T20 World Cup Pant Dinesh Karthik
T20 World Cup Pant Dinesh Karthik

T20 World Cup Pant Dinesh Karthik: టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12 దశ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి సెమీస్‌ పోరు పైనే. గ్రూప్‌-2లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియా.. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీఫైనల్‌లో అడిలైడ్‌ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ సమయంలో జట్టు కూర్పు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం సరైన టీమ్‌తో బరిలోకి దిగి రోహిత్‌ సేన తమ ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేయాల్సి ఉంటుంది.

ఎవరికి చోటు దక్కుతుందో?
గ్రూప్‌ దశలోని తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా రిషబ్‌ పంత్‌కు బదులు దినేష్‌ కార్తీక్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుదిజట్టులో స్థానం కల్పించింది. చివరి ఓవర్లలో ఫినిషర్‌గా దినేశ్‌ కార్తీక్‌ రాణిస్తాడని ఆశించింది. ఐతే పాకిస్తాన్‌పై కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన దినేశ్‌ కార్తీక్, బంగ్లాదేశ్‌పై 6, దక్షిణాఫ్రికాపై 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. బెస్ట్‌ ఫినిషర్‌గా పేరున్న డీకే.. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చూపిన కారణంగా.. జింబాబ్వే మ్యాచ్‌కు అతడి స్థానంలో పంత్‌ను ఆడించారు. ఐతే ఆ పోరులో పంత్‌ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్‌కు ఇద్దరిలో తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

రవిశాస్త్రి ఛాయిస్​ ఎవరంటే?
దినేశ్‌ కార్తీక్​, పంత్‌.. ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలి అనే దానిపై టీమ్​ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో విఫలమైనా పంత్‌నే కొనసాగించాలని శాస్త్రి సూచించారు. ఇంగ్లాండ్‌పై పంత్‌ ప్రదర్శన బాగుంటుందని అన్నాడు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల విషయానికి వస్తే.. బలమైన ఎడమచేతి వాటం గల బ్యాట్స్‌మెన్‌ అవసరమని తనకి అనిపిస్తుందని శాస్త్రి అన్నారు. గురువారం మ్యాచ్‌ జరగనున్న అడిలైడ్‌లో షార్ట్‌ స్క్వేర్‌ బౌండరీలు ఉన్నాయనీ.. ఎడమ చేతి వాటం గల పంత్‌ ఇక్కడ కీలకమవుతాడని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లాండ్‌పై గతంలో పంత్‌ ప్రదర్శన బాగుందని మెచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: IPL 2023: ఆ ఆటగాళ్లకు గుడ్​బై చెప్పనున్న సన్​రైజర్స్​.. లిస్ట్​ రెడీ చేసిన కావ్య​!

T20 World Cup Pant Dinesh Karthik: టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 12 దశ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి సెమీస్‌ పోరు పైనే. గ్రూప్‌-2లో అత్యధిక విజయాలతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియా.. టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచింది. సెమీఫైనల్‌లో అడిలైడ్‌ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ సమయంలో జట్టు కూర్పు అత్యంత ప్రాధాన్యంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం కోసం సరైన టీమ్‌తో బరిలోకి దిగి రోహిత్‌ సేన తమ ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేయాల్సి ఉంటుంది.

ఎవరికి చోటు దక్కుతుందో?
గ్రూప్‌ దశలోని తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వికెట్‌కీపర్‌గా రిషబ్‌ పంత్‌కు బదులు దినేష్‌ కార్తీక్‌కు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తుదిజట్టులో స్థానం కల్పించింది. చివరి ఓవర్లలో ఫినిషర్‌గా దినేశ్‌ కార్తీక్‌ రాణిస్తాడని ఆశించింది. ఐతే పాకిస్తాన్‌పై కేవలం ఒక పరుగు మాత్రమే చేసిన దినేశ్‌ కార్తీక్, బంగ్లాదేశ్‌పై 6, దక్షిణాఫ్రికాపై 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపర్చాడు. బెస్ట్‌ ఫినిషర్‌గా పేరున్న డీకే.. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చూపిన కారణంగా.. జింబాబ్వే మ్యాచ్‌కు అతడి స్థానంలో పంత్‌ను ఆడించారు. ఐతే ఆ పోరులో పంత్‌ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీస్‌కు ఇద్దరిలో తుదిజట్టులో ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

రవిశాస్త్రి ఛాయిస్​ ఎవరంటే?
దినేశ్‌ కార్తీక్​, పంత్‌.. ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలి అనే దానిపై టీమ్​ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. జింబాబ్వేతో మ్యాచ్‌లో విఫలమైనా పంత్‌నే కొనసాగించాలని శాస్త్రి సూచించారు. ఇంగ్లాండ్‌పై పంత్‌ ప్రదర్శన బాగుంటుందని అన్నాడు. ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌ల విషయానికి వస్తే.. బలమైన ఎడమచేతి వాటం గల బ్యాట్స్‌మెన్‌ అవసరమని తనకి అనిపిస్తుందని శాస్త్రి అన్నారు. గురువారం మ్యాచ్‌ జరగనున్న అడిలైడ్‌లో షార్ట్‌ స్క్వేర్‌ బౌండరీలు ఉన్నాయనీ.. ఎడమ చేతి వాటం గల పంత్‌ ఇక్కడ కీలకమవుతాడని శాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇక ఇంగ్లాండ్‌పై గతంలో పంత్‌ ప్రదర్శన బాగుందని మెచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: IPL 2023: ఆ ఆటగాళ్లకు గుడ్​బై చెప్పనున్న సన్​రైజర్స్​.. లిస్ట్​ రెడీ చేసిన కావ్య​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.