ETV Bharat / sports

టీ20 వరల్డ్​కప్​ జట్టు ఎంపిక కోసం బీసీసీఐ తీవ్ర కసరత్తులు- రోహిత్​, కోహ్లీతో చర్చలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 7:45 PM IST

Updated : Jan 3, 2024, 6:19 AM IST

T20 World Cup India Squad : టీ20 వరల్డ్​కప్​ గురి పెట్టింది టీమ్ఇండియా. ఈ మెగా టోర్నీ జట్టును ఎంపిక చేయడానికి అజిత్​ అగార్కర్​ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీతో కూడా చర్చలు జరపనుంది. ఐపీఎల్​లో 30 మంది ప్లేయర్లను పరిశీలించనుంది. ఆ వివరాలు మీకోసం.

T20 World Cup India Squad
T20 World Cup India Squad

T20 World Cup India Squad : 2023లో వన్డే వరల్డ్​ ఫైనల్​లో ఓడి త్రుటిలో మెగా టోర్నీ చేజార్చుకున్న టీమ్​ఇండియా, ఈ ఏడాది జూన్​లో జరగబోయే టీ20 వరల్డ్​ కప్ టైటిల్​ ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంతకుముందు అఫ్గానిస్థాన్​తో జరగనున్న టీ20 సిరీస్​ ఆడే జట్టు ఎంపిక కోసం అజిత్​ అగార్కర్​ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్​ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అఫ్గానిస్థాన్​ సిరీస్​కు జట్టును ప్రకటించే ముందు టీమ్ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రావిడ్​ సహా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో సెలక్షన్ కమిటీ చర్చలు జరపనుంది. అంతేకాకుండా ఐపీఎల్​లో దాదాపు 30 మంది ప్లేయర్ల ప్రదర్శనను ఈ కమిటీ పరిశీలించనుంది.

2022 టీ20 వరల్డ్​కప్​ భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో చివరిసారి రోహిత్​, కోహ్లీ కనిపించారు. అప్పటి నుంచి ఈ పొట్టి ఫార్మాట్​లో ఈ స్టార్లు ఆడలేదు. అయితే జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్​తో జరగబోయే సిరీస్​లో వీరిద్దరిని తీసుకుంటారా లేదా ఐపీఎల్​లోనే వీరి ఫామ్​ను టెస్ట్​ చేస్తారా అనేది వేచి చూడాలి.
టీ20 వరల్డ్​కప్​ కెప్టెన్​గా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఇద్దరూ ఫిట్​గా లేరని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అఫ్గానిస్థాన్​ సిరీస్​తో ఏదీ తేలదని చెప్పారు. ఐపీఎల్​ మొదటి నెల ప్రదర్శన ఆధారంగానే ప్రతి విషయం నిర్ణయిస్తారని అన్నారు.

2024 ICC Mens T20 World Cup : 2024 వరల్డ్​కప్ ఈ ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్​ కోసం ఆయా జట్ల ఇప్పటికే సన్నద్ధత ప్రారంభించాయి. ఇక టోర్నీలో ఈ ఎడిషన్​లో 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లను 5 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు. ఇక గత 13 ఏళ్లుగా ఐసీసీ టోర్నమెంట్​లో ఛాంపియన్​గా నిలవని టీమ్ఇండియా, పొట్టి కప్పును సీరియస్​గా తీసుకుంది.

T20 World Cup India Squad : 2023లో వన్డే వరల్డ్​ ఫైనల్​లో ఓడి త్రుటిలో మెగా టోర్నీ చేజార్చుకున్న టీమ్​ఇండియా, ఈ ఏడాది జూన్​లో జరగబోయే టీ20 వరల్డ్​ కప్ టైటిల్​ ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంతకుముందు అఫ్గానిస్థాన్​తో జరగనున్న టీ20 సిరీస్​ ఆడే జట్టు ఎంపిక కోసం అజిత్​ అగార్కర్​ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్​ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. అఫ్గానిస్థాన్​ సిరీస్​కు జట్టును ప్రకటించే ముందు టీమ్ఇండియా హెడ్​ కోచ్​ రాహుల్​ ద్రావిడ్​ సహా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో సెలక్షన్ కమిటీ చర్చలు జరపనుంది. అంతేకాకుండా ఐపీఎల్​లో దాదాపు 30 మంది ప్లేయర్ల ప్రదర్శనను ఈ కమిటీ పరిశీలించనుంది.

2022 టీ20 వరల్డ్​కప్​ భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో చివరిసారి రోహిత్​, కోహ్లీ కనిపించారు. అప్పటి నుంచి ఈ పొట్టి ఫార్మాట్​లో ఈ స్టార్లు ఆడలేదు. అయితే జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్​తో జరగబోయే సిరీస్​లో వీరిద్దరిని తీసుకుంటారా లేదా ఐపీఎల్​లోనే వీరి ఫామ్​ను టెస్ట్​ చేస్తారా అనేది వేచి చూడాలి.
టీ20 వరల్డ్​కప్​ కెప్టెన్​గా సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య ఇద్దరూ ఫిట్​గా లేరని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అఫ్గానిస్థాన్​ సిరీస్​తో ఏదీ తేలదని చెప్పారు. ఐపీఎల్​ మొదటి నెల ప్రదర్శన ఆధారంగానే ప్రతి విషయం నిర్ణయిస్తారని అన్నారు.

2024 ICC Mens T20 World Cup : 2024 వరల్డ్​కప్ ఈ ఏడాది జూన్ 4 నుంచి 30 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్​ కోసం ఆయా జట్ల ఇప్పటికే సన్నద్ధత ప్రారంభించాయి. ఇక టోర్నీలో ఈ ఎడిషన్​లో 20 జట్లు తలపడనున్నాయి. ఈ 20 జట్లను 5 గ్రూపులుగా విభజించి లీగ్ మ్యాచ్​లు నిర్వహించనున్నారు. ఇక గత 13 ఏళ్లుగా ఐసీసీ టోర్నమెంట్​లో ఛాంపియన్​గా నిలవని టీమ్ఇండియా, పొట్టి కప్పును సీరియస్​గా తీసుకుంది.

టీ20 వరల్డ్​కప్ లోగో రిలీజ్ - బ్యాట్ బాల్, ఎనర్జీ అంటూ ఇంట్రెస్టింగ్ వీడియో ఔట్

ఐసీసీ టోర్నీలో మరోసారి నిరాశ.. సెమీస్​లో భారత్​ ఓటమి.. ఫైనల్​కు ఆసీస్​

Last Updated : Jan 3, 2024, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.