టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచుల్లో టీమ్ఇండియా దుమ్ములేపింది. రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. అయితే.. ఈ వార్మప్ మ్యాచులు జట్టు ఫామ్ నిర్ధారించడానికి ప్రమాణం కాదని భారత మాజీ క్రికెటర్(T20 world cup 2021) యువరాజ్ సింగ్ అన్నాడు. కానీ ఆటగాళ్లు వ్యక్తిగతంగా అంచనా వేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పాడు. అయినప్పటికీ టీమ్ఇండియా బలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. రెండో టీ20 ప్రపంచకప్ తన ఖాతాలో వేసుకునే(T20 world cup latest news) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
"టీమ్ఇండియా మొత్తం రాణిస్తేనే విజయం సాధ్యం. కానీ టీ20లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కేవలం ఐదు ఓవర్లలో ఆట దూరమైపోయే అవకాశాలుంటాయి. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ను టీమ్ఇండియా పోలి ఉంది. టైలెండర్లు కూడా బ్యాటింగ్ చేయగలరు. జడేజా, హార్దిక్, రిషభ్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. యూఏఈ గ్రౌండ్స్పై కూడా మన జట్టుకు అవగాహన ఉంది. అక్కడి మైదానాలు స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తాయి"
-యువరాజ్ సింగ్, భారత మాజీ ఆల్రౌండర్
అరుదైన సందర్భం..
టీమ్ఇండియా 2007లో ధోనీ సారథ్యంలో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ గెలుచుకుంది. మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రెండింటిలోనూ ఆడాడు. కోహ్లీసేన మరో టీ20 వరల్డ్కప్కు సిద్ధమైన నేపథ్యంలో అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లాండ్తో వార్మప్ మ్యాచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టిన అపురూప సందర్భాన్ని జ్ఞప్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్ల్లో యువరాజ్ 11,000 పరుగులు చేశాడు. 148 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి:T20 WORLD CUP: బ్రెట్ లీ జోస్యం.. టాప్ స్కోరర్, బౌలర్ వాళ్లే!